యంగ్ నిఖిల్ తన ‘అర్జున్ సువరం’ మూవీని విడుదల చేయడానికి అంతా కొత్తవారు నటించిన ఒక చిన్న సినిమాను చూసి భయపడి పోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అనేకసార్లు రకరకాల కారణాలతో వాయిదా పడిన ఈ మూవీకి అనేక ఆర్ధిక కష్టాలు కూడ ఏర్పడ్డాయి. 

ఇప్పుడు ఆ సమస్యలు అన్నీ తీరిపోవడంతో ఈ మూవీని ఈనెల 29న విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నితిన్ సినిమాలకు మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమాను సోలో సినిమాగా రిలీజ్ చేయడానికి నితిన్ ఎన్ని ప్రయత్నాలు ఉంటాయో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. 

ఈ మూవీతో పోటీగా విడుదల అవ్వడానికి ప్రయత్నిస్తున్న కొన్ని చిన్న సినిమాల దర్శక నిర్మాతల దగ్గరకు వెళ్ళి తమ సినిమాల రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోమని అడుగుతున్నట్లుగా వార్తలు రావడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. దీనితో ఒకప్పుడు మిడిల్ రేంజ్ యంగ్ హీరోగా ఒక వెలుగు వెలిగిన నిఖిల్ కు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఏమిటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా నిఖిల్ తో సినిమాలు తీయడానికి చాలా మంది యంగ్ డైరెక్టర్స్ భయపడి పోతున్నట్లు కూడ వార్తలు వస్తున్నాయి. నిఖిల్ తన మూవీ మేకింగ్ విషయాలలో తల దూర్చడమే కాకుండా హీరోయిన్ ఎంపిక నుండి ఆ మూవీ ఎడిటింగ్ వరకు అన్ని విషయాలలోనూ వేలు పెట్టడమే కాకుండా తన స్థాయికి మించిన యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్న నేపధ్యంలో నిఖిల్ తో సినిమాలు తీయాలి అంటే చాలామంది భయపడి పోతున్నట్లు టాక్. దీనికితోడు ఈ వారం విడుదల కాబోతున్న ‘జార్జి రెడ్డి’ మూవీ మ్యానియాను చూసి కూడ నిఖిల్ భయపడుతున్న పరిస్థితులలో మరొకసారి ‘అర్జున్ సురవరం’ వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: