ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్  కొడుకు పూరీ ఆకాష్ హీరో గా " రొమాంటిక్ " సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఆకాష్ పూరీ కి జంటగా కేతికాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి  మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం  ఈ సినిమా షూటింగ్ గోవా లో జరగుతుంది. ఈ సినిమా కు  అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఆయన మొదటి సినిమా.


నటి  రమ్యకృష్ణ షూటింగ్  లో నిర్మాత ఛార్మి తో దిగిన ఫోటో ను ట్వీట్టర్ లో  షేర్ చేసింది. గోవాలో జరుగుతున్న రొమాంటిక్ షూటింగ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఆకాష్ , కేతికాశర్మ ల జంట చాలా బాగా నటిస్తున్నారు. వచ్చే   వేసవి కాలంలో  విడుదల అవుతున్న ఈ సినిమా యూత్ కు చాలా బాగా నచ్చుతుంది. దర్శకుడు అనిల్ పాడూరి సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ మరియు నా రాక్షసి ఛార్మి తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందని రమ్యకృష్ణ ట్వీట్ చేసారు. 


ఈ ట్వీట్ కి చార్మి స్పందించారు. ఈ సినిమాకు మీరు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తాను అని ఛార్మి ట్వీట్ చేసింది. రొమాంటిక్ సినిమా కి పూరీ జగన్నాథ్ మరియు ఛార్మి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. రమ్యకృష్ణ ప్రస్తుతం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సీరిస్  " క్యీన్" లో నటిస్తుంది. ఈ వెబ్ సీరిస్ ను దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ని 2020 లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: