ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. సీనియర్ నటి విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. వాస్తవానికి రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. ఇక మరోవైపు సరిగ్గా అదేరోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్న అల్లు అర్జున్

త్రివిక్రమ్ ల అలవైకుంఠపురములో సినిమా, ప్రమోషన్స్ విషయంలో దూసుకెళ్తూ ఇప్పటికే రెండు సాంగ్స్ మరియు ఒక సాంగ్ వీడియో ప్రోమో రిలీజ్ చేసి మంచి క్రేజ్ సంపాదించడం జరిగింది. అయితే సరిలేరు నీకెవ్వరు మాత్రం ప్రమోషన్స్ మాత్రం ఆలస్యం అవడానికి ఒక ముఖ్య కారణం ఉందట. సినిమా రిలీజ్ కు ఇంకా రెండు నెలలు గ్యాప్ ఉందని, కావున ఇప్పుడే సినిమాకు సంబందించిన అంశాలు కనుక రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తే, సినిమాపై ప్రేక్షకుల్లో రాను రాను అంచనాలు తారా స్థాయికి చేరతాయని, రిలీజ్ రోజున వారు అనుకున్న విధంగా ఏ మాత్రం సినిమా లేకపోయినా, దానిని వారు రిజెక్ట్ చేసే అవకాశం ఉందని భావించి, దర్శకుడు అనిల్ రావిపూడి, 

సరిగ్గా రిలీజ్ కు ఒక నెల ముందుగా, అనగా డిసెంబర్ లో పూర్తి స్థాయి ప్రమోషన్స్ మొదలెడదాం అని ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ విషయమై కొందరు సినిమా విశ్లేషకులు మాట్లాడుతూ, ప్రస్తుతం సరిలేరు సినిమా విషయమై ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియనప్పటికీ, ఒకవేళ నిజమే అనుకుంటే, దర్శకుడు అనిల్ గారు భావిస్తుంది సరైనదే అని, కాకపోతే మహేష్ బాబు వంటి పెద్ద హీరోల ఫ్యాన్స్ మాత్రం తమ హీరోకు సంబందించిన సినిమా ప్రమోషన్స్ ఎంత త్వరగా మొదలెడితే అంత బాగుంటుందని భావిస్తుంటారనేది మాత్రం ఒకింత గుర్తుంచుకోవాలని అంటున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: