ఈ మద్య తమిళన నాట
హీరో ధనుష్, మాలీవుడ్
బ్యూటీ మంజు
వారియర్ నటించిన ‘అసురన్’ సూపర్ హిట్ అయ్యింది.
వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా తమిళనాట సంచలన విజయం సాధించింది. ఇప్పటికే రూ.150 కోట్ల క్లబ్ లో చేరిన ఈ
మూవీ కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది. దాంతో ఈ
మూవీ రిమేక్ పై తెలుగు,
హిందీ నిర్మాతలు, నటులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తెలుగులో ‘అసురన్’ సినిమాను
విక్టరీ వెంకటేశ్ హీరోగా
రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘అసురన్’ సినిమాకు దర్శకుడిగా కొంతమంది పేర్లను పరిశీలించినా చివరికి దర్శకుడు
శ్రీకాంత్ అడ్డాలను తీసుకున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాను
సురేష్ ప్రొడక్షన్స్,
వి క్రియేషన్స్ సంస్థల్లో
సురేష్ బాబు,
కళైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. కొంత కాలంగా మంచి కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న
హీరో వెంకటేష్కి ఈ ‘అసురన్’ బాగా సెట్ అవుతుంది చిత్రయూనిట్ భావించారు. ఇక మల్టీస్టారర్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్నారు
విక్టరీ వెంకటేశ్. వాస్తవానికి ఈ
మూవీ ముందుగా రాజగారి గది సినిమాతో మంచి విజయం అందుకున్న యాంకర్,
డైరెక్టర్ ఓంకార్ ని తీసుకోవాలని అనుకున్నారట..కానీ ఈ
మూవీ యాక్షన్ భరిత చిత్రంతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ కావడంతో మరో దర్శకుడికి అప్పజెప్పాలని చూశారు నిర్మాతలు.
అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనుంది. ఈ ఏడాది
సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్,
వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2 ’ మూవీతో మంచి విజయం అందుకున్నారు. ఇక వెంకటేశ్ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్
మూవీ ‘వెంకీ మామ’. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ
మూవీ రిలీజ్ డేట్ పై తర్జన భర్జన జరుగుతుంది.