ప్రస్తుతం ఈ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో, రోజు రోజుకి మంచి ప్రేక్షకాదరణతో మరియు అత్యధిక టిఆర్పి రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. మొదట ఇటువంటి కామెడీ షోలు తెలుగులో ఎంత వరకు సక్సెస్ అవుతాయి భావించినప్పటికీ, మెల్లగా ఒక్కొక్కరుగా తమ టాలెంట్ తో పలువురు కమెడియన్స్  ఈషో లో సందడి చేయటం, అలానే వారు చేసే స్కిట్స్ తో షోపై మెల్లగా క్రేజ్ పెరుగుతూ రావడం జరిగింది. ఆ విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్న జబర్దస్త్ షో ప్రస్తుతం ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 

ఇక ఈ షోకి మొదటి నుంచి జడ్జీలుగా నాగబాబు మరియు రోజా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే మధ్య మధ్యలో కొందరు వేరే జడ్జీలు వస్తున్నప్పటికీ,  పూర్తి స్థాయిలో మాత్రం వీరిద్దరే కొనసాగుతున్నారు. అయితే ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ హఠాత్తుగా నాగబాబు ఈ షో నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం, అతి త్వరలో జీ తెలుగు చానల్లో ప్రసారం కానున్న ' సర్ సర్లే ఎన్నో అనుకుంటాం' అనే షోకు నాగబాబు జడ్జీగా వ్యవహరించబోతుండడమేనట. ఈ విషయమై ఇటీవల జబర్దస్త్ టీంకు మరియు నాగబాబుకు మధ్య తలెత్తిన కొద్దిపాటి విభేదాల కారణంగానే ఆయన ఈ షో నుండి తప్పుకొని జీ తెలుగుకు వెళ్లి పోతున్నట్లు సమాచారం. 

ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఆయనతో పాటు రోజా కూడా అతి త్వరలో ఈ షో మంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి ప్రత్యేకించి కారణం తెలియనప్పటికీ, ఎమ్మెల్యేగా ఆమెకు ఉంటున్న కార్యక్రమాల బిజీ షెడ్యూల్ వల్ల జబర్దస్త్ కు రావటం ఆమెకు కొంచెం ఇబ్బందిగా మారిందని, అందుకే ఆమె షో నుండి తప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నేడు పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది......!!


మరింత సమాచారం తెలుసుకోండి: