ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఎన్నో విశేషాలకు.. బోలెడన్ని ఆసక్తకరమైన అంశాలకు వేదికైంది. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మకంగా అందజేసిన ఈ అవార్డులను
2019 సంవత్సరానిగాను ప్రముఖ
బాలీవుడ్ సీనియర్ నటి రేఖకు అందించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా
మెగాస్టార్ చిరంజీవి హాజరై ఇప్పటి వరకు తన జీవితంలో ఎవరికీ తెలియని, ఎవరితో పంచుకోని ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పి అందరికి 'చిరు' షాకిచ్చారు మెగాస్టార్. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం జరిగిన ఒక వాస్తవ సంఘటనని గొప్ప దర్శక, రచయితలా చక్కటి స్క్రీన్ ప్లే తో సహా చెప్పి ఆశర్య పరచారు.
"అదో పల్లెటూరు. ఆ పల్లెటూరు ముచ్చటైన జంట. నెలలు నిండిన గర్భవతి. రేపో..మాపో డెలివరీకి సిద్ధంగా ఉంది. అలాంటి సమయంలో తన అభిమాన నటుడి
సినిమా రిలీజ్ అయ్యింది. ఆ
సినిమా చూడాలన్నది ఆ నెలలు నిండిన గర్భవతి కోరిక. తన మనసులోని మాటను భర్తకు చెప్పింది. రోజులు నిండాయి.. ఇప్పుడు సినిమానా? అని అన్నారు.
డెలివరీ అయ్యాక కొన్ని నెలల వరకు సినిమాకు వెళ్లలేము కదా..! అందుకే ఇప్పుడు చూడాలను కుంటున్నా.. అని మనసులోని మాట చెప్పింది.
భార్య ఇష్టాన్ని కాదనలేని ఆ భర్త.. పల్లెటూరు నుంచి పట్నానికి వెళ్లేందుకు జట్కా బండిని సిద్ధం చేయించాడు. గతుకుల రోడ్డు మీద సినిమాకు వెళ్లటం కష్టం కదా? అంటే.. ఫర్లేదని ఉత్సాహంగా సమాధానమిచ్చి బయలుదేరారు. అలా వెళుతున్న వాళ్ళ బండికి ప్రమాదం జరిగి.. రోడ్డు పక్కకు జట్కా బండి పడింది. ఆమెకు చిన్న గాయాలయ్యాయి. ఇంత జరిగిన తర్వాత సినిమానా? అని
భర్త అంటే..ఏం ఫర్లేదు అంటూ తన అభిమాన నటుడి
సినిమా చూసేందుకు ఉత్సాహం చూపింది. ఆ సినిమాకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత వెంటనే ఆమె డెలివరీ అయ్యింది.." అంటు కథ చెప్పారు చిరంజీవి.
ఈ కథలో గర్భిణి ఎవరో కాదని.. తన తల్లి అంజనాదేవి అని..
భర్త తన
తండ్రి వెంకట్రావు అని.. వాళ్ళు ఆనాడు వెళ్లింది 1955లో రిలీజైన 'రోజులు మారాయి' అన్న
సినిమా అని.. ఆ
సినిమా హీరో ఏఎన్నార్ అని.. తన తల్లికి నాగేశ్వరరావు గారు అంటే అంత అభిమానమని చిరు చెప్పారు. అన్ని చెప్పి.. ఆ రోజున తన తల్లి కడుపులో ఉంది ఎవరో కాదు.. తానేనని చెప్పారు. ఇలా తాను సినిమాల మీద ఇష్టం పెంచుకోవటానికి తన తల్లి అభిరుచే కారణమన్న విషయాన్ని చెప్పి.. చదువు అయిన వెంటనే
మద్రాస్ వెళ్లాలని నిర్ణయించుకోవటంలో తన తల్లికి
సినిమా మీద ఉన్న ఇష్టమే కారణమని ఈ సందర్భంగా చెప్పారు. ఈ విషయం తెలియడం తో అక్కినేని ఫ్యామిలీ సంబరం లో మునిగి తేలారు. అంతేకాదు దాదాపు 60 ఏళ్ళుగా ఎవరికి తెలియని ఈ విషయం ఇప్పుడు తెలియగానే
మెగాస్టార్ లైఫ్ లో ఇంకెన్ని ఆసక్తి కరమైన విషయాలున్నాయో అన్న ఆతృత అందరిలోను మొదలైంది.