రకుల్ ప్రీతి సింగ్ ఈ పొడుగు సుందరి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో హడావుడిగా  వచ్చేసి టాలీవుడ్లో బాగానే మకాం వేసింది. ఈ అమ్మడు ఎకాఎకిన స్టార్ హీరోయిన్ కూడా అయిపోయింది. ఒకనాడు మెగా క్యాంప్ ను అసలు విడిచిపెట్టకుండా ఆఫర్ల మీద ఆఫర్లు కొట్టేసిన ఈ ముద్దు గుమ్మకు వరసగా రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో సీన్ టోటల్ గా  మారిపోయింది. రకుల్ ని బ్యాక్ బెంచ్ కి తోసేసి మరీ కుర్ర భామలు టాలీవుడ్లోకి  దూసుకొచ్చేశారు.


దాంతో రకుల్ ప్రీత్ సింగ్ ఇపుడు పూర్తిగా సీనియర్ హీరోలను నమ్ముకుందని అంటున్నారు. ఈ  అమ్మడు చాలా తెలివిగా కెరీర్ కంటిన్యూ చేయడానికి పెద్ద హీరోలనే పెద్ద దిక్కుగా చేసుకుందని చెబుతున్నారు.ఎందుకంటే వారికి హీరోయిన్లు దొరకడం కష్టంగా మారుతోంది. అదే సమయంలో కుర్ర హీరోయిన్లు నో చెప్పేస్తున్నారు. ముప్పయ్యేళ్ళు వచ్చినా కూడా తరగని అందాలతో ఇంకా గ్లామర్  తో మంచి ఊపు మీద ఉన్న  రకుల్ వైపు వారి చూపు కూడా ఉందని అంటున్నారు.


ఈ నేపధ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో అజయ్ దేవగణ్ తో నటించింది. కోలీవుడ్లో  వెటరన్ స్టార్  కమల్ హాసన్ సరసన ఇండియన్ టు లో నటిస్తోంది. ఇక తెలుగులో నాగార్జునతో మన్మధుడు 2 మూవీ చేస్తే భారీ డిజాస్టర్ అయింది. అయితే ఇపుడు ఇదే నాగార్జున రకుల్ ని పిలిచి మరీ మరో చాన్స్ ఇచ్చాడట. నాగ్ లేటెస్ట్ గా సోల్ మన్ అనే డైరెక్టర్ తో చేస్తున్న మూవీలో హీరోయిన్ గా రకుల్ ని సెలెక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. మరి రకుల్ కి తెలుగులో ఎటూ కుర్ర హీరోల పక్కన అసలు చాన్స్ లేదు.


పైగా ఈ అమ్మడు సీనియర్లతో ఎపుడైతే కమిట్ అయిందో అంతా పక్కన పెట్టేశారు. మరి రాంగ్ రూట్లో వెళ్ళినా  కూడా ఇపుడు దాన్నే రైట్ రూట్ గా మార్చుకోవాలని రకుల్ నానా తంటాలు పడుతోంది. ఈ నేపధ్యంలో రకుల్ వైపు మిగిలిన సీనియర్ల కన్ను కూడా పడిందట. మొత్తానికి చాలా తొందరగానే ముదురు భామ  శ్రియ ప్లేస్ లోకి రకుల్ వచ్చేసిందంటున్నారు. దాంతో సీనియర్లు పండుగ చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: