బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ ఇచ్చిన తరువాత, తాప్సీ పన్నూ యొక్క చివరి గా విడుదల అయిన సాంద్ కి ఆంఖ్ ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి ప్రశంసలు పొందుతోంది. ప్రస్తుతం సాంద్ కి ఆంఖ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తోంది. జోహ్రీ గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధ షార్ప్షూటర్ల జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది, తాప్సీ మరియు భూమి పెడ్నేకర్ ప్రకాశి తోమర్ మరియు చంద్రో తోమర్ పాత్రలు పోషించారు.
'గేమ్ ఓవర్' ఫేమ్ నటి తాప్సీ పన్నూను తను వివాహం చేసుకోబోయే వ్యక్తి గురించి అడిగినప్పుడు, “నేను స్వయంగా పైకి ఎదిగిన వ్యక్తిని. నాకు చిత్ర పరిశ్రమలో
గాడ్ ఫాదర్స్ అంటూ ఎవరూ లేరు. ఈ రోజు నేను ఈ స్థానం లో వున్నాను అంటే, అది నా కృషి వల్లనే. కాబట్టి నేను కష్టపడి మంచి స్థానానికి చేరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ” అని తెలిపింది తాప్సి.
తాప్సీ పన్నూ ప్రకారం, ఆమె నిజాయితీగల వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటుంది ఎందుకంటే ఆమె కూడ నిజాయితీగల
మహిళ అని నమ్ముతుంది. తన
జీవిత భాగస్వామి తనకు విలువ ఇవ్వాలని ఆమె కోరుకుంటుంది. ప్రస్తుతం తాప్సీ పన్నూ ఆర్ఎస్విపి యొక్క రష్మి రాకెట్లో ప్రధాన పాత్రలో నటించనున్నారు, దీనికి ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించారు,
రోనీ స్క్రూవాలా, ప్రంజల్ ఖండ్డియా, మరియు నేహా
ఆనంద్ నిర్మించారు మరియు నందా పెరియసామి కథను రాశారు.
తాజా సమాచారం ప్రకారం, తాప్సీ పన్నూ వయాకామ్ 18 యొక్క తదుపరి ప్రాజెక్ట్లో భారత మహిళా
క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ
రాజ్ బయోపిక్ లో మిథాలీ
రాజ్ పాత్రను పోషిస్తుంది. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, ఈ ప్రాజెక్ట్
2020 మధ్యలో షూటింగ్ జరుపుకుని 2021 లో విడుదల అవుతుంది.