టాలీవుడ్‌లో చిన్న చిన్న‌, కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇచ్చి ఎంక‌రేజ్ చేసేవారిలో స్టార్ హీరో నాగార్జున ముందు వ‌రుస‌లో ఉంటారు. నాగార్జున ఎంతో మంది చిన్న‌, కొత్త ద‌ర్శ‌కుల‌ను ఎంక‌రేజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అదే టైంలో త‌న‌కు హిట్ ఇవ్వ‌ని వారి విష‌యంలో మాత్రం చాలా నెగిటివ్‌గా మాట్లాడ‌తాడ‌ని.. వారి విష‌యంలో చాలా క‌ఠినంగా ఉంటాడ‌న్న టాక్ కూడా ఉంది.


భాయ్ సినిమా డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్రం చౌద‌రి విష‌యంలో ఇది ఓపెన్ అయిపోయింది. భాయ్‌ డిజాస్టర్ కావడంతో సినిమా గురించి, దర్శకుడి గురించి చాలా నెగెటివ్‌గా మాట్లాడాడు, అది ఆ దర్శకుడి కెరీర్ మీదే ప్రభావం చూపింది. ఆ త‌ర్వాత సోగ్గాడే చిన్ని నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి మంచి హిట్లు త‌న ఫ్యామిలీకి ఇచ్చిన కుర‌సాల క‌ళ్యాణ్ కృష్ణ బంగార్రాజు స్క్రిఫ్ట్‌తో నాగ్ ద‌గ్గ‌ర‌కు వెళితే అది బాలేద‌ని ఓపెన్‌గా చెప్ప‌డం కూడా క‌ళ్యాణ్‌కు మైన‌స్ అయ్యింది.
ఇక మ‌న్మ‌థుడు 2 త‌ర్వాత రాహుల్ ర‌వీంద్ర‌న్‌పై సైతం నాగ్ అస‌హ‌నంతో ఉన్నాడ‌ట‌.

ఇలా నాగ్ ఓ ఆటాడుకున్న ద‌ర్శ‌కుల్లో ఢ‌మ‌రుకం ద‌ర్శ‌కుడు శ్రీనివాస్‌రెడ్డి ఒక‌రు. ఆ సినిమా త‌ర్వాత హ‌లో బ్ర‌ద‌ర్‌కు సీక్వెల్ చేస్తాన‌ని ఆయ‌న‌కు మాట ఇచ్చార‌ట‌. అది లేట్ అవ్వ‌డంతో నాగ‌చైత‌న్య‌తో దుర్గ‌కు చేసే ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేయించాడ‌ట నాగ్‌. ఇందులో కూడా నాగ్‌దే కీల‌క పాత్ర అని గుస‌గుస‌లు అప్ప‌ట్లో వినిపించాయి.


ఇప్పుడు శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పుడు ఛాన్స్‌లే లేవు. ఇటీవ‌ల ఆయ‌న మాట్లాడుతూ మ‌ధ్య‌లో త‌న‌కు కొన్ని ఛాన్సులు వ‌చ్చి క్యాన్సిల్ చేయ‌డం వ‌ల్లే త‌న కెరీర్ ఇలా అయ్యిందంటూ శ్రీనివాస్‌రెడ్డి ప‌రోక్షంగా నాగ్ మీద త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు టాక్‌.. ? ఇక ఇప్పుడు శ్రీనివాస్‌రెడ్డి రాగల 24 గంటల్లో సినిమాతో వ‌స్తున్నాడు. మ‌రి ఈ సినిమాతో అయినా స‌క్సెస్ అవుతాడేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: