టైటిల్ చూసి ఏంటి అనుకోకండి.. గుడ్ న్యూస్ ట్రైలర్ గురించే ఇదంతా.. ఇంకా విషయానికి వస్తే.. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, అక్షయ్ కుమార్, దిల్జీత్ దొసాన్జ్, కియారా అద్వానీ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గుడ్ న్యూస్'. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయినా కొద్ది సమయానికే ట్రైలర్ ఓ రేంజ్ లో ట్రేండింగ్ లిస్ట్ లోకి చేరుకుంది. ట్రేండింగ్ లో ఉండేంత ట్రైలర్ ఏంటి అని అనుకుంటున్నారా ? 


అదేనండి.. అంత కామెడీ, ఎమోషన్స్ తో సినిమా చిత్ర విచిత్రంగా ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకులకు ఆకట్టుకుంది. కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ (వరుణ్ బాత్రా), కరీనా కపూర్ (దీప్తి బాత్రా) వయసు అయిపోయే లోపు పిల్లలని కనాలి అనుకుంటారు. 


అచ్చం అలానే దిల్జీత్ (హనీ బాత్రా), కియారా అడ్వాణీ(మోనికా బాత్రా)ల కూడా ఉంటుంది. దీంతో వీరు నాలుగు ఒకరికి తెలియకుండా ఒకరు ఆసుపత్రికి వస్తారు. అక్కడ డాక్టర్లు మీకు పిల్లలు పుట్టారు అని తేల్చి చెప్పేస్తారు. ఇంకా చేసేది ఏమి లేక.. ఎలా అయినా పిల్లలు కావాలని ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటారు. అలానే వరుణ్, హనీలా వీర్యాన్ని సేకరిస్తారు. 


అయితే అక్కడే కన్ఫ్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరి ఇంటి పేర్లు బాత్రానే ఉండేసరికి డాక్టర్స్ కన్‌ఫ్యూజ్ అయ్యి దీప్తి కడుపులోకి హనీ వీర్యాన్ని, మోనికా కడుపులోకి వరుణ్ వీర్యాన్ని పంపుతారు. ఈ విషయం తెలుసుకున్న నలుగురు షాక్ కి గురవుతారు. ఆ తర్వాత ఎం జరిగింది అనేది ఇంకా సినిమాలోనే చూడాలి. కన్ఫ్యూషన్ కాన్సెప్ట్ అయినా చాలా కొత్తగా ఉంది. 


కామెడీ, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 27న న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమా ఎంతమాత్రం హిట్ అవుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: