మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ప్రతిరోజు పండగే. ఇప్పటికే ఇటీవల చిత్రలహరి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న సాయి తేజ్, ఈ సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఎంతో కసిగా వర్క్ చేస్తున్నాడు. సాయి తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు తాతయ్యగా సత్యరాజ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు ఒక సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకుని శ్రోతలను అలరించడం జరిగింది. 

ఇకపోతే నేడు కాసేపటి క్రితం ఈ సినిమా నుండి 'ఓ బావ' అనే లిరికల్ సాంగ్ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. వాస్తవానికి ఇటీవల ఈ సాంగ్ వీడియో ప్రోమోని కొద్దోరుజుల క్రితం రిలీజ్ చేయడం జరిగింది. యువ సింగర్స్ సత్యయామిని, మోహన భోగరాజు, హరితేజ ఈ సాంగ్ ని ఎంతో అద్భుతంగా ఆలపించారు. ఒక బావని మరదలు ఏ విధంగా సరదాగా ఆటపట్టిస్తూ పొగుడుతుందో ఈ పాటలో వర్ణించడం జరిగింది. కేకే సాహిత్యాన్ని అందించిన ఈ సాంగ్ కి యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ అదిరిపోయే ట్యూన్ ని అందించాడు అనే చెప్పాలి. ప్రస్తుతం యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పాట, 

యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. యువి క్రియేషన్స్, జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాసు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక కొన్నాళ్ల క్రితం రాశి ఖన్నా మరియు సాయి తేజ్ ల కలయికలో వచ్చిన సుప్రీమ్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో, ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా మంచి ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకులు ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: