చిన్న వయసులో తెలుగు తెరకు పరిచయం అయిన దర్శకుడు సుజిత్ తన మొదటి మూవీ ‘రన్ రాజా రన్ ’తో మంచి విజయం అందుకున్నాడు.  తొలి ప్రయత్నంలోనే ఈ యువ దర్శకుడు సక్సెస్ ను సాధించాడు.  కామెడీ, సెంటిమెంట్ తో పాటు మంచి యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘రన్ రాజా రన్’ సాధించిన విజయంతో వెంటనే స్టార్ హీరో ప్రభాస్ తో ఒక ప్రతిష్టాత్మక మూవీ చేసే అవకాశం దక్కించుకున్నాడు. రూ.360 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా రూపొందిన ‘సాహెూ’ మూవీ మొదటి నుంచి భారీగా అంచనాలు నమోదు చేసుకుంటూ వచ్చింది. 

మూవీ తెలుగు, కన్నడ, మళియాళ, హిందీ భాషల్లో రూపొందించారు.  అన్ని భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజే బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో కంటెంట్ తక్కువ బిల్డప్ ఎక్కువ అనే విమర్శలు వచ్చాయి.  అంతే కాదు బాహుబలి సీరీస్ తర్వాత ప్రభాస్ లాంటి హీరోని చూపించే విధంగా కాకుండా సింపుల్ గా చూపించారని దర్శకుడిపై విమర్శలు వెల్లువెత్తాయి. 

మొత్తానికి  ఈ మూవీ ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.  అయితే దీనికి కారణం సుజీత్ అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఘోరంగా ట్రోల్ చేశారు. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న సుజీత్, శర్వానంద్ కోసం ఓ కథను సిద్ధం చేశాడట. రేపో మాపో ఆయన ఆ కథను శర్వానంద్ కి వినిపించనున్నాడని అంటున్నారు. గతంలో మాధిరిగా మంచి కామెడీ కథ అయితే.. మరి శర్వానంద్ కి కథ నచ్చి ఓకే చెబితే ఈ మూవీతో అయితో అయినా మంచి సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: