సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ల ఫస్ట్ క్రేజి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్తో, హైటెక్నికల్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఒక పవర్ఫుల్
పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో
మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన `దర్బార్` మోషన్
పోస్టర్ కి ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ గా ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
సూపర్ స్టార్ రజిని
నవంబర్ 14 నుండి డబ్బింగ్ స్టార్ట్ చేసి నేటితో పూర్తి చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను
2020 సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. కబాలి, కాలా చిత్రాలు ఆశించినంత హిట్లు రాకపోయినా శంకర్ దర్శకత్వంలో రోబో2 బాక్సాఫీస్ ముందు పర్వాలేదనిపించింది. ఇక మరి దర్బార్ ఎలా ఉండబోతుంది వేచి చూడాలి.
ఈ సందర్భంగా దర్శకుడు ఏ ఆర్
మురుగదాస్ మాట్లాడుతూ, "సూపర్ స్టార్
రజినీకాంత్ గారితో
దర్బార్ చేయడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే ఆయనతో చేసిన ఈ డబ్బింగ్ సెషన్ నా లైఫ్ లో మెమొరబుల్." అన్నారు
రజినీకాంత్ సరసన
నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో
నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది,
సునీల్ శెట్టి, తంబీ రామయ్య,
యోగి బాబు,
ప్రతీక్ బబ్బర్,
నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: సంతోష్ శివన్, మ్యూజిక్: అనిరుద్ రవి చంద్రన్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, దర్శకత్వం: ఎ.ఆర్. మురుగదాస్