డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో చాలా రోజుల తర్వాత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ కేవలం పూరికి మాత్రమే కాకుండా హీరో రామ్ పోతినేని, హీరోయిన్స్ నిధీ అగర్వాల్, నభా నటెష్, మరో నిర్మాత చార్మీకి, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ..ఇలా చాలా మందికి బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. రామ్ కు కెరీర్ లో పెద్ద సక్సస్ ని ఇచ్చింది. ఇక హీరోయిన్స్ కు కూడా ఇస్మార్ట్ సక్సెస్ తో మంచి ఫేమ్ వచ్చింది. ముఖ్యంగా నిధి అగర్వాల్ అంతకు ముందు నాగ చైతన్య తో చేసిన సవ్య సాచి, అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ఞు.. వంటి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. కాని ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సస్ సొంతం చేసుకోవడంతో నిధి కెరీర్ టర్న్ తీసుకుంది.

ప్రస్తుతం పూరి నిర్మాణంలో 'రొమాంటిక్' సినిమా తెరకెక్కుతుంది. చిత్ర బృందం గోవాలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఆకాష్ పూరి హీరోగా పూరి శిష్యుడు అనీల్ పాదూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. రొమాంటిక్ సినిమా చిత్రీకరణ పర్యవేక్షించేందుకు నిర్మాత పూరి తో పాటు సహ నిర్మాత ఛార్మి గోవాలో ఉన్నారు. ఇదే సమయంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా అక్కడకు వెళ్లింది. 

పూరి, ఛార్మిని కలిసిన నిధి అగర్వాల్ రోజులో సగంను నాకు ఇష్టమైన పూరి అండ్ ఛార్మిలతో గోవాలో గడిపినట్లుగా సోషల్ మీడియాలో ఫొటోతో సహా పోస్ట్ చేసింది. గోవాకు ఇస్మార్ట్ నిధి ఎందుకు వెళ్లింది అనేది క్లారిటీ లేదు. రొమాంటిక్ లో ఏమైనా చిన్న పాత్ర పోషిస్తుందా లేదంటే మరేదైనా సినిమా కోసం ఈ అమ్మడు గోవా వెళ్లిందో తెలియదు. కాని అక్కడ తన ఇస్మార్ట్ టీం ను కలిసి ఎంజాయ్ చేసినట్లుగా మాత్రం చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఇస్మార్ట్ జోష్ ఇంకా తగ్గలేదని ఈ ఫొటో చూసిన జనాలు చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: