తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ఆయన ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. తనకు నచ్చిన సినిమా గురించి ప్రమోట్ చేయడంలో వెనుకడుగు వేయని రాజమౌళి కొన్నాళ్లుగా ఏ సినిమాకు తన సపోర్ట్ అందించట్లేదు.

 

ఎందుకంటే మొహమాటానికి పోయి రాజమౌళి ఒక సినిమా బాగుందని చెప్పి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడితే అది తనకే రివర్స్ లో తగులుతుంది. అందుకే ఎంత సన్నిహితుల సినిమా అయినా సినిమా చూస్తున్నాడు తప్ప తన మాటగా ఏమి ప్రచారం చేయట్లేదు. అయితే అలాంటి రాజమౌళి ఇప్పుడు మళ్లీ ఓ చిన్న సినిమాకు సపోర్ట్ గా నిలుస్తున్నాడు.

 

మ్యూజిక్ డైరక్టర్ ఎం.ఎం కీరవాణి తనయుడు సిం హా హీరోగా కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా వస్తున్న సినిమా మత్తు వదలరా. ఈ సినిమాను హేమలత నిర్మిస్తుండగా రితేష్ రానా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి మరో తనయుడు కాల భైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా చూసిన రాజమౌళి కొన్ని సలహాలు ఇచ్చాడట. జక్కన్న సలహాలతోనే సినిమా చిన్న చిన్న మార్పులు చేస్తున్నారట.

 

మొత్తానికి మత్తు వదలరా సినిమాకు రాజమౌళి రాజ ముద్ర పడుతుంది. సినిమా మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ గా నడుస్తుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాకు రాజమౌళి ఇచ్చిన ఐడియాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. డిసెంబర్ 25న క్రిస్ మస్ కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్న ఈ సినిమా రిలీజ్ పై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కీరవాణి తనయుడు కాబట్టి రాజమౌళి కచ్చితంగా తన సొంత సినిమాలానే ఈ సినిమాకు సలహాలు ఇచ్చి ఉంటాడు. మరి సినిమా ఫలితం బాగుంటే రాజమౌళి కూడా సంతోషపడే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: