అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకార్ధంగా ఏయన్నార్ నేషనల్ అవార్డ్ కార్యక్రమం చేపట్టారు అక్కినేని కుటుంబ సభ్యులు. నాగార్జున ఈ కార్యక్రమాన్ని చూసుకుంటున్నారు. అయితే గత సంవత్సరం, ఈ సంవత్సరానికి సంబందించిన ఏయన్నార్ అవార్డులను ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రధానోత్సవం చేశారు.

 

2018 సంవత్సరానికి దివంగత శ్రీదేవికి, 2019 ఏయన్నార్ నేషనల్ అవార్డ్ ను బాలీవుడ్ నటి రేఖకు అందించారు. శ్రీదేవి బదులుగా ఆమె భర్త బోనీ కపూర్ వచ్చి ఇది అందుకున్నారు. అయితే ఈ అవార్డుల వేడుకల్లో అక్కినేని కోడలు సమంత కనిపించలేదు. దాదాపు అక్కినేని ఫ్యామిలీ మొత్తం వచ్చిన ఈ ఈవెంట్ కు సమంత ఎందుకు డుమ్మా కొట్టిందని ఆరా తీస్తున్నారు.

 

సమంత సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటం వల్ల ఈవెంట్ కు రాలేకపోయిందని అంటున్నారు. అయితే బోనీ కపూర్ న్యూయార్క్ నుండి డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చేశాడు. మరి అలాంటిది సమంత ఓరోజు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని అవార్డ్ ఫంక్షన్ కు రాలేకపోయిందా అంటూ చెప్పుకుంటున్నారు. అయితే సమంత ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్ వారి నిర్మాణంలో వస్తున్న ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సీక్వల్ లో ఆమె నటిస్తుంది.

 

ఈ షూటింగ్ లో భాగంగానే ఆమె హైదరాబాద్ లో లేదని అంటున్నారు. అయితే ఈమధ్య నాగార్జునతో సమంత దూరంగా ఉంటుందన్న వార్తలు వచ్చాయి. నాగ్ రీసెంట్ మూవీ మన్మథుడు 2 చేయడం సమంతకు అసలు ఇష్టం లేదట తన మాట కాదని చేశాడని మామగారి మీద అలక పూనిందట. అయితే కేవలం సమంత షూటింగ్ లో ఉండబట్టే ఏయన్నార్ అవార్డ్ ఫంక్షన్ కు రాలేకపోయిందన్నదే వాస్తవం అంటున్నారు ఆమె సన్ణితులు. ఏదో ఒక సందర్భంలో మళ్లీ వీళ్లంతా కలిసి కనిపిస్తేనే గాని ఈ డౌట్ క్లియర్ అయ్యేలా లేదు.   

మరింత సమాచారం తెలుసుకోండి: