సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

 

2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకు పోటీగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్ కు దిగుతుండటంతో రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మహేష్ సినిమాపై ఊహించని విధంగా నెగటివ్ వార్తలు వస్తున్నాయి.

 

సినిమా టీజర్ ఇంకా రిలీజ్ కాలేదు. ప్రమోషన్స్ లో మహేష్ సినిమా వీక్ అంటూ.. మహేష్ సరిలేరు నీకెవ్వరు సేం అదే సినిమా కథ అంటూ ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై మహేష్ మూవీ టీం సీరియస్ అవుతుంది. కావాలని కొంతమంది ఇలా నెగటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఘట్టమనేని ఫ్యాన్స్ మాత్రం ఇది మెగా ఫ్యాన్స్ పనే అంటూ చెప్పుకుంటున్నారు.  

 

అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం తమకు అంత అవసరం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్య అల్లు అర్జున్ మీద కూడా నెగటివ్ గా బ్యానర్ లు సైతం కట్టి హంగామా చేశారు. అయితే ఇది ఎవరో కావాలని చేస్తున్న పని అని అంటున్నారు. కేవలం మహేష్ సినిమా గురించి మాత్రమే కాదు అల్లు అర్జున్ సినిమాపై కూడా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరు ఫ్యాస్ మధ్య గొడవ పెట్టేందుకు వేరే హీరోల ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారా లేక కావాలనే ఇదంతా సినిమా ప్రమోషన్స్ కు వాడేందుకు వారే చెబుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: