సంక్రాంతి రేస్ కు విడుదలకాబోతున్న ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీల మధ్య నెలకుని ఉన్న తీవ్రపోటి మహేష్ అల్లు అర్జున్ లకు మాత్రమే కాకుండా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ను కూడ కలవర పెడుతోంది. ఈరెండు సినిమాలలో ఒక సినిమాకు దిల్ రాజ్ నిర్మాతగా వ్యహరుస్తుంటే మరో సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతూ ఉండటంతో ఈరేసు ఫలితం దిల్ రాజ్ కు కూడ ఆర్ధికంగా అత్యంత కీలకంగా మారింది. 

దీనికితోడు ఈమూవీలకు అత్యంత భారీ స్థాయిలో మార్కెట్ జరగడంతో ఈమూవీలను కొనుక్కున్న బయ్యర్లు కూడ బన్నీ మహేష్ ల మధ్య జరగబోతున్న వార్ ను చూసి భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈరెండు సినిమాలకు అత్యంత భారీ కలక్షన్స్ వచ్చే విధంగా ఈరెండు సినిమాలలో ఏఒక్కటి పై నెగిటివ్ టాక్ రాకుండా చేయడానికి ఈమూవీల ప్రమోషన్ కు సంబంధించి క్రాస్ ప్రమోషన్ టెక్నిక్ ను మొట్టమొదటిసారిగా ప్రయోగించబోతున్నట్లు టాక్.

వాస్తవానికి ఈఆలోచన మహేష్ బన్నీలకు ఇచ్చింది దిల్ రాజ్ అన్న ప్రచారం జరుగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈక్రాస్ ప్రమోషన్ పద్ధతిలో ‘అల వైకుంఠపురములో’ మూవీ యూనిట్ ను దర్శకుడు అనీల్ రావిపూడి ఇంటర్వ్యూ చేస్తూ ఒక వీడియో విడుదల చేస్తే ‘సరులేరు నీకెవ్వరు’ మూవీ యూనిట్ ను దర్శకుడు త్రివిక్రమ్ ఇంటర్వ్యూ చేసి మరొక వీడియోను విడుదల చేస్తారు.

ఈరెండు వీడియోలు అన్ని ప్రముఖ ఛానల్స్ లో ప్రసారం చేస్తూ ఈరెండు మూవీల ప్రమోషన్ హోరెత్తించి ఈరెండు సినిమాల పై మ్యానియా ఏర్పడే విధంగా ఈరెండు సినిమాలు కూడ సంక్రాంతి విజేతలుగా మార్చాలని దిల్ రాజ్ ప్లాన్ అని అంటున్నారు. ఈప్లాన్ కు మహేష్ బన్నీలు కూడ ఓకె చెప్పినట్లు సమాచారం. దీనితో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ హీరో సినిమాను మరొక టాప్ హీరో ప్రమోట్ చేసే కొత్త కల్చర్ ఏర్పడి టాప్ హీరోల మధ్య అనవసరపు దూరాలు తగ్గి ఒక పాజిటివ్ సంకేతం ఇవ్వాలని చేస్తున్న ఈకొత్త ప్రయత్నం ఎంతవరకు సక్సస్ అవుతుందేమో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: