ప్రస్థుతం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కోసం అనుక్షణం శ్రమిస్తూ ఈమూవీని ఎట్టి పరిస్థితులలో వచ్చే ఏడాది జూలైలో విడుదల చేయాలని చాలగట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ కు అనేక అనుకోని సమస్యలు ఏర్పడినా వాటిని పట్టించు కోకుండా ధృఢ నిశ్చయంతో రాజమౌళి ఆలోచనలు అన్నీ ‘ఆర్ ఆర్ ఆర్’ చుట్టూనే తిరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో రాజమౌళి కీరవాణి కొడుకు సింహను హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ‘మత్తువదలరా’ మూవీని చక్కదిద్దవలసిన బాధ్యత కూడ ప్రస్తుతం రాజమౌళి పై పడింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీని రితేష్ రానా అనే యంగ్ డైరెక్టర్ తీస్తున్నాడు. 


ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ పూర్తి కావడంతో ఈమూవీని ఈమధ్య కీరవాణి తన కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా చూపించినట్లు సమాచారం. ఈ మూవీని చూసిన తరువాత కీరవాణి కుటుంబ సభ్యులు అతడి సన్నిహితులు ఈ మూవీకి సంబంధించిన అనేక మార్పులు చేర్పులు సూచించడంతో ఆ మార్పులను దగ్గర ఉండి రితేష్ రానా చేత చేయించ వలసిందిగా కీరవాణి ప్రత్యేకంగా రాజమౌళిని కోరినట్లు టాక్. 

దీనితో రాజమౌళి ఈ సినిమాలోని ప్రతి సీన్ ను చాల వివరంగా చూస్తూ ఆ మూవీలో ఎలాంటి మార్పులు చేయాలో సూచించడమే కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాగా రూపొందుతున్న ఈమూవీలో సీన్స్ ఎలా ఉండాలో వాటిని ఎలా ఎడిట్ చేయాలో రాజమౌళి ఈ యంగ్ డైరెక్టర్ కు సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు అవసరం అనుకుంటే కొన్ని సీన్స్ ను రీ షూట్ చేసే విషయంలో రాజమౌళి తన కొడుకు కార్తికేయ సహకారం కూడ తీసుకుని కీరవాణి కొడుకును మొదటి సినిమాతోనే గుర్తింపు వచ్చే హీరోగా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటాయో అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: