పక్కా కామెడీ సినిమాలు తీసే దర్శకుడు శ్రీనివాస రెడ్డి గతంలో ఒకేసారి ‘ఢమరుకం’ లాంటి భారీ బడ్జెట్ సినిమాను నాగార్జునతో తీసి తన స్థాయికి మించిన ప్రయోగం చేసి ఆప్రయోగంలో ఘోరంగా విఫలం అయ్యాడు. ఆతరువాత ఈదర్శకుడు ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే సినిమాను తీసి ఫెయిల్ కావడంతో ఈదర్శకుడు పేరును పూర్తిగా మరిచిపోయారు.

ఇలాంటి పరిస్థితులలో ఈదర్శకుడు తిరిగి తెరుకోవాలని ‘రాగల 24 గంటలలో’ అనే థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహించి ఈవారం విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల అయిన ఈమూవీ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీని శ్రీనివాస రెడ్డి చాల గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈదర్శకుడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లేటెస్ట్ మూవీని ప్రమోట్ చేస్తూ నాగార్జునను కార్నర్ చేసే విధంగా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

నాగార్జున తనకు తానుగా తనను పిలిచి ‘ఢమరుకం’లో ఛాన్స్ ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తన పనితనం నచ్చి ఆమూవీ తరువాత ‘హలో బ్రదర్’ సీక్వెల్ చేద్దామని నాగార్జున ప్రపోజల్ పెట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు ఆ సీక్వెల్ కోసం తాను 10 నెలలు స్క్రిప్ట్ పై పనిచేశాక ఆ స్క్రిప్ట్ ను పక్కకు పెట్టి నాగార్జున నాగచైతన్యతో ‘దుర్గ’ అనే సినిమా చేసే అవకాసం ఇవ్వడమే కాకుండా ఆ మూవీ ప్రారంభోత్సవం కూడ జరిగాక ఆ మూవీని కారణాలు కూడ తెలపకుండా నాగ్ ఆపేసిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. 

అయితే ఇది అంతా ‘ఢమరుకం’ ఫెయిల్యూర్ వల్ల జరిగి ఉంటుందని ఈవిషయాలలో తాను నాగార్జునను తప్పు పట్టలేకపోయినా నాగార్జునతో భారీ సినిమా తీసి తాను కెరియర్ పరంగా నష్టపోయాను అంటూ అసహనానికి గురి కావడమే కాకుండా కొన్ని సార్లు జరిగే పొరపాట్లకు ఎవరు కారణంకాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇప్పటికైనా ఈ దర్శకుడు దర్శకత్వం వహించన ‘రాగల 24 గంటలలో’ హిట్ అయ్యే అదృష్టం ఉందో లేదో ఈ వారం తెలిసిపోతుంది..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: