అక్కినేని యువ హీరో అఖిల్ కెరియర్ లో మంచి హిట్టు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ ను మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో అఖిల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మిస్తున్నాడు.

 

ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ తన 5వ సినిమా దర్శకుడిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈసారి తెలుగు దర్శకులతో కాకుండా తమిళ దర్శకుడితో అఖిల్ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అఖిల్  5వ సినిమా తమిళ దర్శకుడు పి.ఎస్ మిత్రన్ తో ఉంటుందని కోలీవుడ్ టాక్. రీసెంట్ గా అఖిల్, మిత్రన్ ను కలిసి కథా చర్చలు జరిపారని తెలుస్తుంది.

 

తమిళ యువ దర్శకుడు పి.ఎస్ మిత్రన్ ఇరుంబు తిరై సినిమా చేశాడు. తెలుగులో అభిమన్యుడుగా ఈ సినిమా రిలీజైంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం పి.ఎస్.మిత్రన్ శివకార్తికేయన్ తో హీరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది.

 

ఇక అఖిల్ కోసం మిత్రన్ ఓ అద్భుతమైన కథ రాసుకున్నాడట. అన్ని కుదిరితే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ మూవీ హిట్ అయితే ఈ సినిమా పక్కా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ మూవీ లవ్ స్టోరీగా రాబోతుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి అఖిల్ ఈ సినిమాతో అయినా హిట్ ట్రాక్ అక్కేస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: