టాలీవుడ్ మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా యువ దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న తాజా సినిమా ప్రతి రోజు పండగే. గతంలో సాయి తేజ్ తో కలిసి సుప్రీం సినిమాలో హీరోయిన్ గా నాటినుంచి రాశి ఖన్నా, ఈ సినిమాలో కూడా ఆయన సరసన జోడి కడుతోంది. గీత ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ బ్యానర్లపై అతంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్య రాజ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు రెండు సాంగ్స్ కూడా యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకోవడంతో పాటు ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసాయి. 

 

ఇకపోతే ఈ సినిమా గురించి నేడు దర్శకుడు మారుతీ మీడియాతో కాసేపు ముచ్చటించారు. మా సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయని, అయితే నిజానికి మా సినిమా మంచి ఎటెర్టైన్మెంట్ తో సాగె ఒక విభిన్న కథా చిత్రం అని మారుతీ చెప్పారు. కుటుంబంలో ఒక వ్యక్తి పుడితే ఎలా ఆనందంగా ఆహ్వానిస్తున్నామో, అదే విధంగా పెద్దవారి చివరిరోజులలో అంతే ఆనందంగా వారికి అద్భుతమైన వీడ్కోలు చెప్పాలి అనే సరికొత్త పాయింట్ మీద ఈ చిత్రం నడుస్తుందని ఆయన అన్నారు. 

 

అలాగే పిల్లలు పెద్దవారైన తరువాత వారి ప్రేమను పిల్లల పైకి మళ్లించి, కన్నవారికి మాత్రం ప్రేమను పంచడం మరిచిపోతున్నారుని, కాగా కీలకమైన ఆ పాయింట్ కూడా ఈ మూవీలో టచ్ చేశాం అని మారుతీ అన్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: