సాయి ధరమ్ తేజ్ వరసగా ఆరు ఫ్లాప్ లు అందుకున్న తరువాత నటించిన ‘చిత్రలహరి’ ఒక మోస్తరి విజయం సాధించడంతో ఆ ఫ్లాప్ ల సెంటిమెంట్ నుండి బయట పడ్డాడు. అయితే తేజ్ ప్రస్తుతం నడుస్తున్న ఈయంగ్ హీరోల పోటీలో నిలబడాలి అంటే ఒక మంచి హిట్ కొట్టాలి. 

దీనికోసమే అనేక ఆలోచనలు చేసి చివరకు మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండుగే’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీని అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న పరిస్థితులలో ఈ మూవీ ప్రమోషన్ భారీ స్థాయిలో ఉండి తనకు మంచి ఇమేజ్ ని తెచ్చి పెడుతుందని తేజ్ ఈ మూవీ ప్రారంభించినప్పుడు అనుకున్నట్లు టాక్.

అయితే ఈ మూవీ విడుదలకు ఇక కేవలం నెలరోజులు మాత్రమే ఉన్నా ఈ మూవీ గురించి అరవింద్ పట్టించుకోకుండా తన దృష్టి అంతా బన్నీ ‘అల వైకుంఠపురములో’ మూవీ పై పెడుతూ ఉండటం తేజ్ షాక్ ఇచ్చినట్లు టాక్. అంతేకాదు ఈ మూవీ ప్రమోషన్ ను ఎలా చేయాలి ఈ మూవీ పాటలకు మరింత క్రేజ్ వచ్చే విధంగా ఎలాంటి వీడియోలు రూపొందించాలి అన్న ఆలోచనలు తప్ప అరవింద్ స్వయంగా నిర్మిస్తున్న ‘ప్రతిరోజు పండుగే’ మూవీ ప్రమోషన్ గురించి చాల తక్కువగా పట్టించు కోవడం తేజ్ కు కొద్దిగా బాధను కలిగించినట్లు గాసిప్పులు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు తేజ్ ఈ మధ్య విడుదలైన తన సినిమాకు సంబంధించిన ‘ఓబావ’ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను బన్నీ ‘సామజవరగమన’ పాట మాదిరిగా ఒక స్పెషల్ సెట్ వేయించి తన ‘ఓబావ’ పాటను కూడ లైవ్ ఆర్కెస్ట్రా నేపద్యంలో సింగర్ చేత పాడించి ఒక లిరికల్ వీడియోగా విడుదల చేస్తే తన మూవీకి కూడ మంచి క్రేజ్ వస్తుంది అన్న భావం తేజ్ కి ఉన్నట్లు టాక్. అయితే ఆ మాటలు అరవింద్ దగ్గర చెప్పలేక తన సినిమాకు ప్రమోషన్ విషయంలో అశ్రద్ధ జరిగితే తన పరిస్థితి ఏమిటి అంటూ తెగ మధన పడిపోతున్నట్లు గాసిప్పులు గుప్పు మంటున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: