ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎన్నో పోరాటలు ఎదురుకొని అతి చిన్న వయసులోనే హత్యకు గురైన లీడర్‌ జార్జ్‌ రెడ్డి. ఇప్పుడు ఇదే కథతో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వంగవీటి ఫేం సందీప్‌ మాధవ్‌ హీరోగా దళం ఫేం జీవన్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి అనూహ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి గట్టి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. 

 

సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను నెక్లెస్‌ రోడ్‌లో గ్రాండ్‌గా చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వేడుకకు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా వస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవన్‌ వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో ఈ వేడుకను వాయిదా కూడా వేయడం జరిగింది. త్వరలో మరో వేదికలో ఈ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ కూడా మొదలు పెట్టారు. ఇక మెగా బ్రదర్‌ నాగబాబు కూడా జార్జ్‌ రెడ్డికి మద్దతు తెలియచేయడం జరిగింది. చిత్రయూనిట్‌ను అభినందిస్తూ ఓ వీడియో మెసేజ్‌ను కూడా నాగబాబు విడుదల చేయడం జరిగింది . అంతేకాదు జార్జ్‌ రెడ్డి.. పవన్‌ కళ్యాణ్ మధ్య పోలికలున్నాయంటూ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచే దిశగా ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది.

 

ఇటీవల  మెగాస్టార్ చిరంజీవి కూడా జార్జ్‌ రెడ్డికి తనవంతు సహాయం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలోని అడుగు అడుగు అనే పాటను మెగా స్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఇలా మెగా హీరోలు ఒక్కొక్కరుగా జార్జ్‌ రెడ్డికి మద్దతు తెలుపుతుండటంతో జార్జ్‌ రెడ్డి పై మెగా ఫ్యామిలీకి ఎందుకింత ప్రేమ అన్న అనుమానాలు బాగా ఎదురు అవుతున్నాయి.

 

ఇక గతంలో 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా నిలిచిన స్టూడెంట్‌ లీడర్‌ జార్జ్‌ రెడ్డి. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో వంగవీటి ఫేమ్‌ సందీప్‌ మాధవ్‌ (సాండి) పాత్ర పోషిస్తున్నాడు. దళం మూవీ ఫేం జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్‌ సినిమా బ్యానర్లతో కలిసి మైక్‌ మూవీస్‌ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 22న విడుదలకు సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: