సాయిధరమ్తేజ్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రతిరోజు పండగే'. మారుతీ దర్శకుడు. బన్నీవాస్ నిర్మాత. అల్లు అరవింద్ సమర్పణ. ఈ చిత్రంలోని రెండో పాట అయిన 'ఓ బావ మా అక్కను సక్కగా చూస్తావా..'ను సోమవారంనాడు హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... నాకు మీడియా నుంచి సపోర్ట్ వస్తోంది. ఈ సాంగ్లో హీరో ఈ బుడ్డమ్మాయి. చాలా బాగా చేసింది. ఎస్.మాస్టర్ కొరిఆయోగ్రఫీ అద్భుతంగా చేశాడు. ఈ పాట ఇంత బాగా షూట్ చేయడానికి కారణం థమన్.. తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులోని ఐదు పాటలు దేనికదే ప్రత్యేకంగా వున్నాయి. థమన్కు ఇన్స్పిరేషన్ ఇచ్చింది మారుతీ అన్న. నాకు 15 నిముసాల్లో లైన్ చెప్పాడు. వారంరోజుల్లో టైం తీసుఉని ఫుల్ నెరేషన్ ఇచ్చాడు. చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులోని ప్రతిపాత్రా.. సత్యరాజ్, రావురమేష్పాత్ర, నాది, రాశీఖన్నాది అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇందులో అందరికీ ఎర్ఫార్మెన్స్కు స్కోప్ వుంది. కరెంట్ ట్రెండ్లో వుండేట్లుగా 'టిక్టాక్ స్టార్'గా రాశీ ఖన్నా పాత్ర వుంటుంది. బెల్లం శ్రీదేవి తర్వాత ఏంజెలానా క్యారెక్టర్ తనకు గుర్తిండిపోతుంది. నాకు ఈ చిత్రంలో ఎటువంటి మతిమరుపు, పరిశుభ్రత వంటి డిసీజ్లు లేవు. కథాపరంగా ప్రతి ఒక్కరం తమను తాము ప్రశ్నించుకునేట్లుగా వుంటుంది. డిసెంబర్ 20న అదేమిటనేది మీకే తెలుస్తుంది' అని చెప్పారు.
రాశీఖన్నా మాట్లాడుతూ... ఈ పాత్రకోసం చాలా కష్టపడ్డాను. నేను టిక్టాక్ చూడను. అందులో లేను. సినిమా కోసం ఫస్ట్టైమ్ చూశాను. చాలా కష్టంగా ఆ వీడియోలు పెడుతున్నారనిపించింది. నాకోసం మంచి పాత్ర దర్శకులు రాశారు. ఇందులో సాంగ్ ప్రత్యేకమైది. 'ఓ బావ..'సాంగ్ చాలా బాగుంది. తమన్ నా కెరీర్లో మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఇది వన్ఆఫ్ది ఫేవరేట్ సాంగ్' అని తెలిపారు.