సురేందర్ రెడ్డి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే కదా. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయింది అని చెప్పారు. సినిమా రూ.100 కోట్ల కు పైగా క్లబ్‌లో చేరింది. అయితే ఇటీవల సురేందర్ రెడ్డి ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాను ఆకాశానికెత్తేశారు. కానీ సురేందర్రెడ్డి పెట్టుకున్న ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయింది. 

 

కానీ సురేందర్ రెడ్డి మాత్రం ఈ సినిమాను బ్లాక్ బస్టర్ అంటూ తెగ ప్రశంసలు కురిపించేశారు. సురేందర్ రెడ్డి  నేను ప్రభాస్‌తో కలిసి 2006లోనే పనిచేయాల్సింది. కానీ ఆ సమయంలో ఇంకొకవైపు ఎన్టీఆర్ మేనేజర్ సుకుమార్ నన్ను సంప్రదించాడు. అందువలన నేను. తారక్‌తో కలిసి సినిమా చేయాలని బలవంతం చేశాడు. ఆయన మాటను కాదనలేక  తప్పక ఎన్టీఆర్‌తో ‘అశోక్’ సినిమా చేశాను. ఈ కథను నేను రూపొందించలేదు. వారే కథను రాసుకుని నన్ను తీయమని చెప్పారు. సరేనని సినిమా చేశాను. కానీ ఆ సినిమా ఫ్లాపైంది.

 

 సినిమా ప్లాప్ అయినందువలన అనవసరంగా తారక్‌తో ఈ సినిమా తీశానని చాలా బాధపడ్డాను’ అన్నారు.అయితే సురేందర్ రెడ్డి ఇలాంటి కామెంట్లు చేయడం ఎన్టీఆర్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో సోషల్ మీడియాలో ఆయన్ను బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ నటించిన ‘అతనొక్కడు’ సినిమాతోనే సురేందర్ రెడ్డి డైరెక్షన్ కెరీర్‌ను మొదలుపెట్టాడని, అలాంటిది తారక్‌తో అశోక్ సినిమా చేసే అవకాశం వచ్చినందుకు సంతోషించాలని విమర్శించారు. 

 

అశోక్ ఫ్లాప్ అయినా కూడా తారక్ మరోసారి ఆయన్ను నమ్మి ‘ఊసరవెల్లి’తో మరో అవకాశం ఇచ్చారని, అలాంటిది ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని తిట్టిపోశారు..సైరా సినిమాతో దాదాపు రెండేళ్ల పాటు కష్టపడిన సురేందర్ రెడ్డి కొంతకాలం పాటు విరాామం తీసుకుని తన కుటుంబంతో కలిసి నెల రోజుల పాటు ఎంజాయ్ చేయాలనుకుంటున్నట్లు ఒకనాకొ సందర్భంలో తెలిపారు. తన తదుపరి సినిమాను డిసెంబర్‌లో ప్రకటిస్తాను అని తెలియచేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: