టాలీవుడ్ లో మెగా హీరోలందరికీ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరంతేజ్ సుప్రీం హీరో గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో మంచి హిట్ కొట్టినప్పటికీ ఆ తర్వాత చేసిన ఏడు  సినిమాలు డిజాస్టర్ గా మారాయి . దీంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్ ముగిసిపోయింది అంటూ ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు సాయి ధరంతేజ్.ప్రస్తుతం  మారుతి దర్శకత్వం లో ప్రతి రోజు పండుగే  సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా నటిస్తోంది. ఈ సినిమా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో  దూసుకుపోతున్నారు.అయితే తాజాగా  ఏర్పాటుచేసిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో హీరో సాయి ధరమ్ తేజ్ రాసి కన్నా డైరెక్టర్ మారుతి జోరుగా పాల్గొన్నారు. 

 

 

 

 ఇప్పటికే ప్రతి రోజు పండుగ సినిమా సాంగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రతిరోజూ పండగే సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో రాశికన్నా సినిమాను  ఉద్దేశించి ప్రసంగం చేస్తుండగా... రాసి కన్నా మాట్లాడుతున్నంత సేపు వెనకాల మెగాహీరో సాయిధరమ్ తేజ్  పగలబడి నవ్వుతూ కనిపించాడు. అయితే ఇది గమనించిన రాసి కన్నా సాయి ధరంతేజ్ నవ్వుతో కాస్త డిస్టబ్ గా ఫీల్ అయినట్టు ఉంది. వెంటనే వెనక్కి తిరిగి ఎందుకు నవ్వుతున్నావ్ చెప్పు అంటూ మెగా హీరోను నిలదీసింది . తర్వాత వెంటనే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని రాశికన్నా... సినిమాలో నా క్యారెక్టర్ గుర్తుకు వచ్చి నవ్వుతున్నాడేమో  అంటూ కవర్ చేసింది . అయితే నిజానికి అయితే టాలీవుడ్ లో హీరోయిన్ లు  ఎవరు హీరోలని  పల్లెత్తు మాట అనడానికి కూడా సాహసం చేయరూ . 

 

 

 

 ఇక అందులోనూ భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న మెగా హీరోలు విషయంలో అలాంటి  ఆలోచన కూడా చేయరు. ప్రస్తుతం రాశి కన్నా సాయి ధరమ్ తేజ్ ను  ఆడియో లాంచ్ లో అలా అనడం ఫిలింనగర్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాయి ధరం తేజ్ ను  రాసి కన్నా స్టేజి మీద నిలదీసిందా  అంటూ ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సాయి ధరంతేజ్ కోస్టార్స్  తో చాలా క్లోజ్ గా ఉంటాడు కాబట్టి ఆ చనువు తోనే  రాసి అలా అని ఉంటుందంటూ మరోవైపు పాసిటివ్ కామెంట్స్  కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా మెగా హీరోను హీరోయిన్ రాశి కన్న  నిలదీయడం మాత్రం ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: