మెగాస్టార్ చిరంజీవి, బి గోపాల్ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇంద్ర. ఆ సినిమా సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆల్బం మొత్తం సూపర్ హిట్టే. ఆర్పి పట్నాయక్ కూడా ఒక సాంగ్ కు మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

 

ఇదే కాదు చిరుతో యమహా నగరి కలకత్తాపురి అంటూ సూపర్ హిట్ సాంగ్ ఇచ్చిన ఘనత మణిశర్మకే దక్కింది. చిరు సినిమా అంటే మణిశర్మ మ్యూజిక్ ఉండాల్సిందే. అయితే కొన్నాళ్లుగా మణిశర్మ వెనుకపడటం.. యువకులు మ్యూజిక్ డైర్క్టర్స్ గా మారడంతో సీనియర్స్ కు అవకాశాలు తగ్గాయి. 

 

ఈమధ్య మళ్లీ మణిశర్మ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో తన సత్తా మరోసారి చాటిన మణిశర్మ మరోసారి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది. కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా ముందు దేవి శ్రీ ప్రసాద్ ను అనుకున్నా అతని ప్లేస్ లో బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ ను సెలెక్ట్ చేశారని తెలిసింది.

 

అయితే ఇప్పుడు మళ్లీ చిరు, కొరటాల శివ తమ ఆలోచన మార్చుకున్నారని తెలుస్తుంది. మణిశర్మకు ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. చిరు, మణిశర్మ ఆల్రెడీ సూపర్ హిట్ కాంబో కచ్చితంగా ఈ సినిమాకు ఈ కాంబినేషన్ పెద్ద అసెట్ అవుతుందని అంటున్నారు. ఇంద్రలో దాయి దాయి దామ్మ సాంగ్ లాంటిది మరోటి ఇస్తే మణిశర్మ మళ్లీ ఫాం లోకి వచ్చేసినట్టే. మరి ఈ విషయంపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: