స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాపేరు సూర్య దారుణంగా ఫ్లాప్ కావడంతో చాలా సమయం తీసుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠ పురంబులో అనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న  క్రమంలో...వెంటనే సుకుమార్ తో చేయాల్సిన సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసేశాడు. అయితే ఈ సినిమా రామ్ చరణ్ తో చేసిన రంగస్థలం సినిమా టైపు ఉంటుందని ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. అనగా గ్రామీణ వాతావరణం నేపథ్యంలో గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు అంతేకాకుండా లారీ డ్రైవర్ గా ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

 

అంతేకాకుండా తాను చేయబోయే పాత్ర కోసం అల్లుఅర్జున్ ఇప్పటినుండే తన శరీరాన్ని దృఢంగా తయారుచేయటానికి సిద్ధమైనట్లు సమాచారం. అది మాత్రమే కాక, కొద్దిపాటి గడ్డంతో రఫ్ లుక్ లో బన్నీ ఈ సినిమాలో కనిపించబోతున్నారని అట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. రష్మిక మందన్న బన్నీతో స్టెప్పులేయనుంది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటించిన ఆర్య మరియు ఆర్య టు సినిమాలు రాగా ఆర్య 2 పెద్ద అభిమానులను మరియు సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది.

 

దీంతో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ మూడో  సినిమాపై అభిమానులను మరియు ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ విక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న అలా వైకుంఠపురం లో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రాబోయే సంక్రాంతి పండుగ కానుకగా రాబోతున్న ఈ సినిమా తో హిట్టు కొట్టి ఎలాగైనా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: