కళ్యాణ్ రామ్ హీరోగా సురేందర్ రెడ్డి తొలిసారి దర్శకత్వం వహించిన అతనొక్కడే సినిమా సూపర్ హిట్ కావడంతో సురేందర్ రెడ్డికి దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. అతనొక్కడే తరువాత సురేందర్ రెడ్డికి స్టార్ హీరో జూనియర్ ఎన్టీయార్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఎన్టీయార్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన అశోక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అనిపించుకుంది. 
 
దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ అతనొక్కడే సినిమా తరువాత ప్రభాస్ తో సినిమా చేయాలని ఒక కథను సిద్ధం చేశానని కానీ అదే సమయంలో జూనియర్ ఎన్టీయార్ మేనేజర్ నన్ను కలిసి అశోక్ సినిమా కథను చేతిలో పెట్టి సినిమా గురించి కూడా ఎన్టీయార్ మేనేజరే అక్కడ షూటింగ్ చేద్దాం...? ఇక్కడ షూటింగ్ చేద్దాం..? అని చెప్పాడని అయిష్టంగానే ఎన్టీయార్ తో సినిమా చేశానని సురేందర్ రెడ్డి చెప్పారు. 
 
ఎన్టీయార్ మేనేజర్ ఒత్తిడి వలనే అశోక్ సినిమా చేయాల్సి వచ్చిందని అశోక్ సినిమా కథ విషయంలో స్పష్టత లేకుండానే చేశానని సురేందర్ రెడ్డి చెప్పారు. అశోక్ సినిమా ఫ్లాప్ ఫలితాన్ని అందుకోవడంతో ఆ తరువాత అంత సులభంగా అవకాశం దొరకలేదని సురేందర్ రెడ్డి చెప్పారు. కానీ ప్రభాస్ కోసం సురేందర్ తయారు చేసిన కథతో ఇప్పటివరకు ప్రభాస్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సినిమా తెరకెక్కలేదు. 
 
ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమాలో నటిస్తున్నాడు. జాన్ సినిమా పూర్తయిన తరువాత ప్రభాస్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సినిమా తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ప్రభాస్ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నాడని సమాచారం. సురేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో నందమూరి అభిమానులు హర్ట్ అయ్యారు. సినిమా చేయటం ఇష్టం లేకపోతే చెప్పి ఉండాల్సిందని ఎన్టీయార్ లాంటి స్టార్ హీరో అవకాశం ఇస్తే వినియోగించుకోలేకపోయాడని జూనియర్ అభిమానులు సురేందర్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: