మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఘట్టం వచ్చేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమా టిజర్ ఎప్పుడు వస్తుందో తేలిపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ను విడుదల తేదిని అఫీషియల్గా ప్రకటించారు.
సూపర్స్టార్ మహేష్ హీరోగా దిల్రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం కర్నూలు జిల్లాలోని కొండా బురుజు సెట్ను రామోజీ ఫిల్మ్ సిటీలో రీ క్రియేట్ చేసారు.ఈ చిత్రం టీజర్ ను 22 సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్ కేరళలోని అంగామలై ఫారెస్ట్లో జరుగుతోంది. నవంబర్ 22 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. నవంబర్ 25 నుంచి హైదరాబాద్లో షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్వైడ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అదే లెక్కన 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మహేష్ బాబు హిట్టు అందుకొని సంక్రాంతి హీరోగా సరిలేరు నాకెవ్వరు అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి.
సూపర్స్టార్ మహేష్, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, తమ్మిరాజు, రామ్లక్ష్మణ్, యుగంధర్ టి., ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.