ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన నిఖిల్ ‘అర్జున్ సురవరం’ ఎట్టకేలకు తన రిలీజ్ డేట్ ను ఫైనల్ చేసుకుని ముందుకు దూకుతోంది. ఈనెల 29న విడుదల కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ఈరోజు విడుదల చేసారు. ఒక మచి థ్రిల్లర్ మూవీకి సరిపడే కథ ఉన్నట్లుగా అంచనాలు ఇచ్చేలా విడుదలైన ఈ ట్రైలర్ కనిపిస్తోంది. 

వాస్తవానికి నిఖిల్ మార్కెట్ ప్రస్తుతం ఏమాత్రం బాగాలేని పరిస్థితులలో ఈ మూవీ సక్సస్ ఈ యంగ్ హీరో కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. తమిళ సినిమా ‘కణితన్’ కు రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా యధాతధంగా తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేసినట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ కథ అంతా హీరో చుట్టూ తిరగే విధంగా ఉండకుండా హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కీలక పాత్ర ఈ మూవీలో ఉంటుంది అన్న లీకులు వస్తున్నాయి. ఈ మూవీ సక్సస్ అయితే నిఖిల్ తనకు హిట్ వచ్చిన ‘కార్తికేయ’ సీక్వెల్ ను తనకు లక్కీ హీరోయిన్ గా సెంటిమెంట్ ను ఏర్పరుచుకున్న స్వాతి తో కలిసి ఈ సీక్వెల్ చేయడానికి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్వాతి పెళ్ళి చేసుకున్నాక సినిమాలకు దూరం అయినప్పటికీ ఆమెను తిరిగి బలవంత పెట్టి నిఖిల్ ఈ సీక్వెల్ ద్వారా రీ ఎంట్రీ చేయిస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా వరస పరాజయాలు ఎదుర్కుంటున్న నిఖిల్ తన లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సురవరం’ విడుదల చేయడానికి భయపడిపోయి అనేక రిలీజ్ డేట్స్ మార్చాడు అంటే ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి ఎంత అయోమయ స్థితిలో ఉందో అర్ధం అవుతుంది. ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర పడిన లావణ్య త్రిపాఠి నెగిటివ్ సెంటిమెంట్ ను తట్టుకుని నిఖిల్ ఎలా నిలబడతాడో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: