స్టైలిష్ దర్శకత్వంతో .. మంచి స్క్రీన్ ప్లేతో పేరు తెచుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో చేసిన సినిమా సైరా నరసింహా రెడ్డి విడుదలై ఘన విజయం సాధించిన సంగతీ తెలిసిందే. ఆ సినిమాకు మంచి టాక్ రావడంతో ఆయన తదుపరి చిత్రంపై చాలా ఆసక్తి నెలకొంది. ఈ సమయంలోనే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. 

 

దీనితో ఎన్టీఆర్ అభిమానుల చేత ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నేను అతనొక్కడే సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రభాస్ కోసం రెడీగా ఉన్న కథతో సినిమా చేయాల్సి ఉంది. అప్పుడే ఎన్టీఆర్ మేనేజర్ ఒకరు నన్ను తీసుకు వెళ్లారు. మూడు రోజుల పాటు నాతో ఉండి 'అశోక్' సినిమా కథను నా చేతిలో పెట్టాడు. నేను ఆలోచించుకోకుండానే అక్కడ చేద్దాం.. ఇక్కడ చేద్దాం.. ఇలా చేద్దాం అంటూ ఆయనే ప్లానింగ్ చేశాడు. ఎన్టీఆర్ ఒక పెద్ద హీరో కనుక కాదంటే ఏమవుతుందో అనే ఉద్దేశ్యంతో చేయాల్సి వచ్చింది.



అని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు గుస్సా అయ్యారు. అశోక్ సినిమా విషయంలో సురేందర్ రెడ్డి తప్పు లేదని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. అశోక్ కథ విషయంలో క్లారిటీ లేకుండానే మేనేజర్ ఒత్తిడి మేరకు చేయాల్సి వచ్చిందని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. అశోక్ సినిమా ఎలాంటి ఫలితాన్ని చవి చూసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అశోక్ మళ్లీ అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అశోక్ సినిమా తీయకుండా ప్రభాస్ తో సినిమా చేయాల్సిన సురేందర్ రెడ్డి అప్పటి నుండి కూడా ప్రభాస్ తో సినిమా చేయలేదు. సురేందర్ రెడ్డి వ్యాఖ్యలతో తీవ్రంగా హర్ట్ అయిన నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో సూరిపై రెచ్చి పోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: