చిత్రలహరి సినిమాతో మంచి హిట్ అందుకున్న సుప్రీం హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘ప్రతీరోజూ పండగే’ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఆయన మరో సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు హైద‌రాబాద్‌లో స్టార్ట్ అయ్యింది. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేసి మే 1, 2020లో సినిమాను విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

 

మారుతి దర్శకత్వంలో తేజు, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ 20న విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రానికి సంగీతం : థమన్, కెమెరా : వెంకట్ సి దిలీప్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా.

 

1993లో 'మనీ' సినిమాలో వచ్చిన ఈ పాట ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఈ పాట వచ్చి మూడు దశాబ్దాలు అవుతున్నా కూడా.. దానికి ఉన్న క్రేజ్ ఏమాత్రం కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా కొత్త పెళ్లికొడుకులను సరదాగా ఏడిపిస్తూ ఈ పాటని పాడుతుంటారు.

 

సాయి తేజ్ చేతిలో ఈచిత్రంతో కలిపి ప్రస్తుతం.. రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి దర్శకుడు మారుతితో చేస్తున్న 'ప్రతిరోజు పండగే'.. మొన్నీమధ్యనే ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరగగా.. త్వరలోనే మరొక కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

 

సాయితేజ్‌, న‌భా న‌టేశ్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం:  సుబ్బు, నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌, ఆర్ట్‌:  అవినాష్ కొల్ల‌, ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలి, సంగీతం: త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  వెంక‌ట్ సి.దిలీప్‌, పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా.

మరింత సమాచారం తెలుసుకోండి: