టాలీవుడ్ ఇండస్ట్రీ నాచురల్ స్టార్ నాని కెరియర్ లో వరుసగా ఫ్లాపులు వస్తున్న తరుణంలో నటించిన ‘జెర్సీ’ సినిమా అదిరిపోయే హిట్ అవడంతో నాని కెరియర్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కడం జరిగింది. అయితే ఆ తరువాత నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమా మళ్లీ పరాజయం పాలు కావడంతో ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు. కాగా ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన 'అర్జున్ రెడ్డి' సినిమా హిందీలో రీమేక్ చేసిన షాహిద్ కపూర్ తాజాగా మరోసారి తెలుగు సినిమా అయినా 'జెర్సీ'  సినిమాని రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు.

 

వరస ఫ్లాపుల్లో ఉన్న షాహిద్ కపూర్ 'అర్జున్ రెడ్డి' రీమేక్ తీసి కబీర్ సింగ్ గా తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ కథని నమ్ముకుని షాహిద్ కపూర్ 'జెర్సీ' సినిమాని రీమేక్ చేయడంతో 'జెర్సీ' సినిమా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గా మృణళ్ ఠాకూర్ సెలక్ట్ అయినట్లు అదిరిపోయే ఛాన్స్ కొట్టినట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

సూపర్ 30 - బట్లా హౌజ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ  ఈ బ్యూటీకి అవకాశాలు పెద్దగా ఆదుకోవడం లేదని ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఫైనల్ గా మంచి రీమేక్ లో బంపర్ అఫర్ కొట్టేసింది. తెలుగులో హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉండడంతో మృణల్ కెరీర్ కు జెర్సీ రీమేక్ మంచి యూ టర్న్ ఇస్తుందని చెప్పవచ్చు. అంతే కాకుండా ఈ సినిమా నిర్మాణ భాగంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు మరియు అల్లు అరవింద్ కూడా ఉండటం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: