ఇప్పటి తరం వాళ్లకు సూపర్ స్టార్ అంటే గుర్తుకు వచ్చేది మహేష్ బాబు.  సూపర్ స్టార్ కృష్ణా వారసుడిగా మహేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్నారు.  మహేష్ సినిమాలు చేస్తూనే తన తండ్రి నుంచి వారసత్త్వంగా పుచ్చుకున్న దయాగుణాన్ని చాటుకుంటున్నాడు.  ఇప్పటికే వందమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహించారు.  


ఇదిలా ఉంటె, సూపర్ స్టార్ కృష్ణ ఓ వినూత్నమైన ప్రయోగం చేశారు.  అదేమంటే తెలంగాణా ఎంపీ సంతోష్ కుమార్ ఇటీవలే గ్రీన్ ఛాలెంజ్ అనే ఓ ఛాలెంజ్ ను తీసుకొచ్చారు.  ఈ ఛాలెంజ్ ప్రకారం మూడు మొక్కలు నాటి, మరొకరిని నామినేట్ చేయాలి.  ఇందులో భాగంగానే సూపర్ స్టార్ కృష్ణ మొక్కలు నాటి, సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ లను నామినేట్ చేశారు.  


మామూలుగానే పవన్ కళ్యాణ్ గ్రీనరీని ఎక్కువగా ఇష్టపడతారు.  గ్రీనరీ కోసమే ఫామ్ హౌస్ తీసుకున్నారు. అక్కడ మొక్కలు పెంచుతున్నారు.  మామిడి ఇతర మొక్కలు నాటి వాటి నుంచి వచ్చే పండ్లను ప్రముఖులకు పంచుతుంటారు పవన్ కళ్యాణ్.  రజినీకాంత్ కూడా ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.  ఈ ఇద్దరు కూడా ప్రకృతికి దగ్గరగా ఉండటంతో వారిని నామినేట్ చేసి ఉంటారని అనుకోవచ్చు.  


సూపర్ స్టార్ కృష్ణ ఆ ఇద్దరు స్టార్స్ ను నామినేట్ చేయడంతో.. ఫ్యాన్స్ షాక్ ఒక విధంగా షాక్ అయ్యారు.  సూపర్ స్టార్ ఇచ్చిన చాలెంజ్ ను ఈ ఇద్దరు ఎలా రియాక్ట్  అవుతారో చూడాలి.  ఎంపీ సంతోష్ కుమార్  ప్రారంభించిన ఈ ఛాలెంజ్  సినీ ప్రముఖులలోకి  తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నట్టు తెలుస్తోంది.  పవన్, రజినీకాంత్ లు కనుక స్పందించి చెట్లు నాటితే ఈ ఛాలెంజ్ సూపర్ సక్సెస్ అయినట్టే అని చెప్పొచ్చు.  మరి ఈ స్టార్స్ దీనిపై స్పందిస్తారా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: