ఈషా రెబ్బా.. అచ్చ తెలుగు అమ్మాయి. అందగత్తె..అందాల ప్రదర్శనలో పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా ఈ అమ్మడికి సరైన హిట్ దొరకలేదు. ప్రస్తుతం ఆమె నటించిన ‘రాగల 24 గంటల్లో’ సినిమా విడుదలకు సిద్దమైంది. నవంబరు 22న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈషా రెబ్బా, సత్యదేవ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. రఘు కుంచె సంగీతం.

 

సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఈషా రెబ్బా.. తన గురించి వస్తున్న ఓ రూమర్ పై క్లారిటీ ఇచ్చింది. ఆమె నెట్‌ఫ్లిక్స్‌ నిర్మాణంలో ‘లస్ట్‌ స్టోరీస్‌’ అనే వెబ్‌సిరీస్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో అంతా కియారా నటించిన పాత్ర చేస్తున్నానని అనుకుంటున్నారట. నిజానికి ఆ సిరీస్‌కు దీనికి ఎలాంటి సంబంధం లేదట. ఈ విషయంపై హీరోయిన్ ఈషా రెబ్బా క్లారిటీ ఇచ్చంది.

 

తాను కనిపించే నాలుగు కథలు పూర్తిగా కొత్తవేనట. ఇందులో రెండు పాత్రలకి నందిని రెడ్డి, తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారట. తాను చేస్తున్న కథకు సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించారట. ఇందులోనూ సత్యదేవ్, ఆషిమా నర్వాల్‌ ముఖ్య పాత్రలు పోషించారట. ఇప్పటికే ఈషా భాగానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందట. వచ్చే ఏడాది మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉందని ఈషా చెబుతోంది

 

స్టార్‌ హీరోలతో చేసే అవకాశం వస్తే కాస్త కథ అటు ఇటుగా ఉన్నా ఒకే చెప్పేస్తానంటోందీ అమ్మడు. శ్రీనివాస్‌ కు తొలి థ్రిల్లర్‌ అయినప్పటికీ ఎంతో క్లారిటీతో తెరకెక్కించారని మెచ్చుకుంోటంది. కథలో ఉన్న మలుపులను ప్రేక్షకులెవ్వరూ ముందుగా ఊహించలేరు. చాలా ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. నాకు ఆయన కథ చెప్పినప్పుడు కూడా తర్వాత ఇలా జరుగుతుందేమో అని అనుకునేదాన్ని. కానీ, నా అంచనాలకు ఎక్కడా దొరికేది కాదు. థ్రిల్లర్‌లకు ఉండాల్సిన ప్రధాన లక్షణం కూడా అదే. సత్యదేవ్‌ పాత్ర కూడా చాలా బాగుంటుంది’ అంటూ ఊరిస్తోంది ఈషా రెబ్బా.

మరింత సమాచారం తెలుసుకోండి: