ఈ వారం విడుదల కాబోతున్న ‘జార్జి రెడ్డి’ మూవీ పై వివాదాలు పెరిగిపోతున్న కొద్ది ఈ మూవీ పై మ్యానియా విపరీతంగా పెరిగిపోతోంది. వాస్తవానికి ఈ మూవీ ఎల్లుండి విడుదల కాబోతుంటే ఒకరోజు ముందుగా రేపు సాయంత్రం ఈ మూవీ ప్రీమియర్ షోలను వేస్తున్నారు అంటే ఈ మూవీకి ఎలాంటి ఓపెనింగ్స్ రాబోతున్నాయో అర్ధం అవుతుంది. 

ఇప్పటికే ఈ సినిమాలో ‘జార్జి రెడ్డి’ పాత్రను పోషిస్తున్న హీరో సందీప్ మాధవ్ కొన్ని సీన్స్ లో పవన్ ఉపన్యాసాలలో చూపించే ఆవేశాన్ని ఇమిటేట్ చేస్తూ పవన్ అభిమానులకు కనెక్ట్ అయ్యేవిధంగా ప్లాన్ వేసాడు. ఇదిచాలదు అన్నట్లుగా ఈమూవీకి సంబంధించిన ‘అడుగు.. ఆ అ డుగు’ సాంగ్‌ ను చిరంజీవి విడుదల చేసి ‘జార్జి రెడ్డి’ ప్రమోషన్ లో చిరంజీవి కూడ భాగస్వామి అయ్యాడు. 

వాస్తవానికి పవన్ కళ్యాణ్ ను అతిధిగా పిలిచి ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను భారీగా నిర్వహించాలి అని భావించారు. అయితే పోలీసు అనుమతులు దొరకక ఈకార్యక్రమం జరగకపోవడంతో ఆలోటును చిరంజీవి చేత పూర్తి చేయించారు. ఈమూవీలోని పాటను రిలీజ్ చేస్తూ చిరంజీవి తాను 1972లో ఒంగోలులో ఇంటర్‌ చదువుతున్నప్పుడు తాను జార్జి రెడ్డి గురించి విన్నానని అప్పట్లో అతడి వార్తలు వచ్చినప్పుడల్లా తాను ఆసక్తిగా వార్తా పత్రికలలో చదివిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈమూవీ అడ్డుకుంటాను అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విరుచుకుపడ్డారు.  చిత్రం ప్రోమోలో ‘వన్ సైడ్’ గా చూపించారని అభిప్రాయ పడుతూ ఈ సినిమా ముసుగులో ఏబీవీపీని కించపరిస్తే సహించమని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనితో ఈ మూవీ పై మరింత వివాదాలు రాజుకునే ఆస్కారం ఉంది. ఈ వివాదాలతో ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ మరింత భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ మరో ‘అర్జున్ రెడ్డి’ అవుతుందా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.. 


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: