టాలీవుడ్ సినిమా పరిశ్రమకు లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్, ఆ తరువాత మగధీర సినిమాతో హీరోయిన్ గా మంచి పాపులర్ అయింది. ఇక అక్కడినుండి ఒక్కొక్కటిగా సినిమాలు చేసుకుంటూ, ఇప్పటివరకు పలువురు టాలీవుడ్, కోలీవుడ్ అగ్ర నటుల సరసన పలు విజయవంతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన కాజల్ అగర్వాల్, ప్రస్తుతం ఎంతో సెలెక్టీవ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది. ఇటీవల యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అ అనే వైవిధ్యమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించిన కాజల్

 

కొద్దిరోజుల క్రితం తేజ తెరకెక్కించిన సీత అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించింది. ఇకపోతే కొద్దిరోజులుగా కొంత డిఫరెంట్ గా సినిమాలు  చేస్తూ ముందుకు సాగుతున్న కాజల్, అతి త్వరలో యువ నటుడు శ్రీవిష్ణుతో కలిసి ఒక సినిమాలో నటించడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. శ్రీ విష్ణు హీరోగా లక్ష్య ప్రొడక్షన్స్ అతి త్వరలో నిర్మించనున్న ఒక సినిమాలో కథానాయికగా కాజల్ ఎంపికయిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ప్రదీప్ వర్మ పరిచయం కానున్నాడు.  పోలీస్ డ్రామా నేపథ్యంలో ఈ కథలో హీరోయిన్ పాత్రకు కూడా ఎంతో గుర్తింపు ఉంటుందని, 

 

అందువల్లనే ఆ పాత్రకు కాజల్ ని సినిమా యూనిట్ ఎంచుకున్నట్లు టాక్. కాజల్ అంగీకరిస్తే అది ఈ సినిమాకి కలిసొచ్చే అంశం అవుతుందని భావిస్తున్నారట యూనిట్ సభ్యులు. బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరోల జోడీగా కనిపించడానికి సైతం ఆసక్తిని చూపుతున్న కాజల్, శ్రీవిష్ణు జోడీగా అలరించడానికి అంగీకరించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాజల్ వంటి స్టార్ హీరోయిన్, యువ కథానాయకుడు శ్రీవిష్ణు తో నటిస్తోంది అంటే, నిజంగా ఇది ఆమె తీసుకున్న సంచలన నిర్ణయమే అంటూ పలువురు అభిమానులు ఆమెను పొగుడుతూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: