తెలుగు ప్రేక్షక అభిమానులు మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే సరిలేరు నీకెవ్వరు టీజర్ ని ఈ నెల 22వ తారీఖున సాయంత్రం 5:04నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన టీజర్ గురించి చాలా సమాచారం తెలిసింది. మొట్టమొదటిగా మహేష్ బాబు ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్ర పోషించడం.. మహేష్ బాబు సరసన తొలిసారిగా రష్మిక మందన్న నటించడం సినిమాలో రెండు పెద్ద హైలెట్స్ అని చెప్పుకోవచ్చు. విజయశాంతి విషయానికొస్తే ఆమె లేడీ అమితాబ్ బచ్చన్.. ఈ సినిమాలో ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్లో నటిస్తుందని సరిలేరు నీకెవ్వరు సినిమా బృందం తెలియజేసింది. 

 

నిన్న విడుదల చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో మహేష్ బాబు ఉగ్రమైన రూపం లో కనిపించి కేకపుట్టించాడు. 
అయితే 22న విడుదలయ్యే టీజర్ లో ఏం చూపించబోతున్నాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం. టాలీవుడ్ వర్గాలు ప్రకారం.. సరిలేరు నీకెవ్వరు దర్శకుడైన అనిల్ రావిపూడి చిత్ర టీజర్ ని ఒక హై రేంజ్ లో కట్ చేశాడని సమాచారం. అటు ఆర్మీ మేజర్ గా.. ఇటు సివిలియన్ గా టీజర్ లో కనిపించి దుమ్మురేపబోతున్నాడు మన ప్రిన్స్ మహేష్ బాబు. ఒక నిమిషానికి పైగా సాగే ఈ సినిమా టీజర్లో మహేష్ బాబు రెండు షేడ్స్ కవర్ అయ్యేవిధంగా చూపించబోతున్నారట. టీజర్ లో మహేష్ బాబు తో పాటు హీరోయిన్ క్యారెక్టర్ పోషిస్తున్న రష్మిక మందన్నని కూడా చూపించనున్నారు. 

 

అనిల్ సుంకర, దిల్ రాజు మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అసలు సరిహద్దుల్లో ఉండే ఒక సైనికుడు.. కర్నూలు జిల్లాకు వచ్చి కత్తి పట్టడం ఏంటి అనే ఆసక్తికరమైన అంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం అభిమానులు వేచి ఉండలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: