ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన బోల్డ్ వెబ్ సిరీస్ సినిమా లస్ట్ స్టోరీస్. నలుగురు ఆడవాళ్ళ జీవితాలు మరియు ఫ్యామిలీకి, అలానే వారి వ్యక్తిగత కోరికల గురించి చూపిస్తూ తెరకెక్కించిన లస్ట్ స్టోరీస్ కు అక్కడ మంచి ఆదరణ లభించింది. తెలుగులో మహేష్ బాబు ప్రక్కన భరత్ అనే నేను లో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీతో పాటు లెజెండ్ మూవీ ఫేమ్ రాధికా ఆప్టే, సీనియర్ నటి మనీష కొయిరాలా, భూమి ఫడ్నీకర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ని తెలుగులో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరక్కించబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు ప్రచారం అయ్యాయి. 

 

అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆ వెబ్ సిరీస్ ను నేను తీయడం లేదని సందీప్ తేల్చి చెప్పడం జరిగింది. అయితే ఫైనల్ గా ఇటీవల దానిని తెరకెక్కించడానికి ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డిని దర్శకుడుగా ఎన్నుకున్నారు నిర్మాతలు. ఒక వారం క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ఈషా రెబ్బ, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు నేడు ప్రకటన రావడం జరిగింది. ఇక ఈ సినిమా విషయమై నేడు కొందరు మీడియా వారితో హీరోయిన్ ఈషా మాట్లాడుతూ, 

 

కథ డిమాండ్ మేరకు తాను కొంత బోల్డ్ గా కూడా నటించడానికి సిద్దమే అని ఆమె అన్నారు. అయితే హిందీ వెర్షన్ తో పోలిస్తే తెలుగు వర్షన్ లో కథలో కొంత తేడా ఉంటుందని, మన ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు సంకల్ప్ రెడ్డి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు టాక్. కాగా అతి త్వరలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసి, మార్చిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఎన్నాళ్ళనుండో ఈ వెబ్ సిరీస్ తెలుగు వర్షన్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: