టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మద్య వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు.  ఒక సూపర్ స్టార్ కి వరుస విజయాలు రావడం నిజంగా ఇండస్ట్రీలోనే హైలెట్ అని చెప్పొచ్చు.  స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు సూపర్ హిట్ తర్వాత భరత్ అనె నేను మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో మహేష్ బాబు నటనకు అభిమానులు ఫిదా అయ్యారు.

 

ఈ ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంలో రైతు గౌరవంపై వచ్చిన ‘మహర్షి’ మూవీలో మూడు రకాల షేడ్స్ లో మహేష్ బాబు తన నటనతో అదరగొట్టాడు.  విద్యార్థి, బిజినెస్ మాన్, రైతు పోరాటం చేసే యువకుడిగా మహేష్ నటన నిజంగా అబ్బో అనిపించింది.  ఈ మూవీ రెండు వందల  కోట్ల క్లబ్ లో చేరింది.  తాజాగా ఇప్పుడు మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడానికి మహేష్ బాబు వస్తున్నారట.   త‌ర్వాత సరిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 

 

స్టార్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చిత్ర రిలీజ్‌కి కొద్ది రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగవంతం చేశారు.  ఈ నెల 22న సాయంత్రం 5:04నిమిషాలకు టీజర్ విడుదల చేయనున్నట్లు పోస్ట‌ర్ ద్వారా తెలిపింది చిత్ర బృందం.  

 

తాజాగా ఈ మూవీ పోస్టర్ మరో సెన్సేషన్ సృష్టిస్తుంది.  క‌త్తి ప‌ట్టుకొని క‌సిగా చూస్తున్న మ‌హేష్ సరిహద్దులోని సైనికుడులా, కర్నూల్ లో నివ‌సించే సివిలియ‌న్‌గా అల‌రించ‌నున్నాడ‌ట‌. ఈ మూవీలో ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది. లేడీ అమితాబ్ విజయశాంతి దాదాపు 13ఏళ్ల తరువాత ఈ మూవీతో వెండి తెరపై కనిపించనున్నారు.  దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: