హైయస్ట్ రేటింగ్స్ తో బుల్లితెర షోలలో ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్న ‘జబర్దస్త్’ షో నుండి ఎందరో కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. ఈ షో ఇచ్చిన క్రేజ్ తో చాలామంది అత్యంత ఖరీదైన కార్లను ఇళ్ళను కొనుక్కునే స్థాయికి ఎదిగారు అంటే ఈషో ఎంతమంది జీవితాలను మార్చివేసిందో అర్ధం అవుతుంది. 
అయితే ఇప్పుడు అలాంటి షో ఒక ఊహించని కుదుపుకు లోనవుతోంది అన్న గాసిప్పులు వస్తున్నాయి. 


ఈషో క్రియేటివ్ టీమ్ నిఖిల్ అతడి బృందం ఈషో నుంచి తప్పుకున్నట్లు వార్తలు రాగానే ఈ షోపై నీలినీడలు కమ్ముకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికితోడు ఈషో నుండి నాగబాబు తప్పుకున్నాడు అంటూ వస్తున్న వార్తలు మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు జీ తెలుగు ఛానల్ త్వరలో ప్రారంభించబోతున్న ‘జబర్దస్త్’ ఛాయలతో ఉండే కార్యక్రమానికి నాగబాబు జడ్జిగా వెళ్ళిపోతున్నాడు అని టాక్. 


అదేవిధంగా ‘జబర్దస్త్’ కార్యక్రమాలకు తన స్కిట్స్ తో గుండెకాయలా గెలిచే హైపర్ ఆదిని కూడ అత్యంత భారీ పారితోషికంతో ఈ కొత్త షోలోకి ఎంటర్ చేయాలని చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురౌతున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు హైపర్ ఆది మల్లెమాల సంస్థకు ఎగ్రిమెంట్ వ్రాసి ఇచ్చిన పరిస్థితులలో ఆ ఎగ్రిమెంట్ అయ్యే వరకు ఆది ‘జబర్దస్త్’ ను వీడే ఛాన్స్ లేదు అని అంటున్నారు. 


వాస్తవానికి సినిమాలో ‘వెంకీమామ’ సినిమాలో ఆది నటించడానికి కూడ మల్లెమాల సంస్థ అనుమతులు తీసుకోవలసి వచ్చింది అని అంటున్నారు. దీనితో ఈ ఎగ్రిమెంట్ బ్రేక్ చేసి ఆది బయటకు వెళ్ళిపోతే ఆదికి అనేక లీగల్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది అంటూ గాసిప్పులు గుప్పుమంటున్నాయి. దీనితో ‘జబర్దస్త్’ లో రోజా పరిస్థితి ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ చేయడమే కాకుండా ఆమె కూడ నాగబాబు బాటను అనుసరిస్తుందా అంటూ సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: