ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకులుగా కొనసాగుతున్న వారిలో ముందు వరుసలో ఉండేది ఎవరంటే, అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు థమన్, దేవిశ్రీప్రసాద్. ప్రతి ఏడాది రిలీజ్ అయ్యే సినిమాల్లో మెజారిటీ సినిమాలు వీరిద్దరివే ఉంటాయి. అయితే మ్యూజిక్ డైరెక్షన్ లో థమన్ కంటే దేవి కొంత సీనియర్. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం అగ్ర సంగీత దర్శకుడుగా కొనసాగిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ తరువాత వచ్చిన దేవి, మెల్లగా ఒక్కొక్కటిగా తన సినిమాలకు అలరించే మ్యూజిక్ అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక థమన్, మొదట శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ లో నటించి, ఆ తరువాత సంగీతం మీద ఇంటరెస్ట్ తో ఈ ఫీల్డ్ లో ప్రవేశించాడు. రవితేజ కిక్ తో సూపర్ హిట్ అందుకున్న థమన్, అక్కడినుండి వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. 

 

ఇక అతి త్వరలో రిలీజ్ కాబోయే పెద్ద సినిమాల్లో ఒకింత ఎక్కువగా థమన్ చేతిలో ఉండగా, సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక  సినిమా సరిలేరు నీకెవ్వరు మాత్రమే దేవి చేతిలో ఉంది. ఇక క్రిస్మస్ కానుకగా రాబోతున్న ప్రతిరోజు పండగే, సంక్రాంతికి రాబోతున్న అలవైకుంఠపురములో, వెంకటేష్ మరియు నాగ చైతన్యల వెంకీ మామ, రవితేజ మరియు విఐ ఆనంద్ కలయికలో రాబోతున్న డిస్కో రాజా సినిమాలు థమన్ కు ఉన్నాయి. అయితే వీటన్నంటిలో ఎక్కువగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మాత్రం సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలపైనే ఉన్నాయి. ఇక ఇప్పటికే 'అల వైకుంఠపురములో' నుండి రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయి, 

 

యూట్యూబ్ లో వ్యూస్ మరియు లైక్స్ పరంగా పలు సంచలనాలు క్రియేట్ చేయగా, మరొక సాంగ్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి శ్రోతలను అలరిస్తోంది. అయితే సరిలేరు నీకెవ్వరు నుడి మాత్రం ఇంతవరకు ఒక్క పాట కూడా రిలీజ్ కాలేదు. కాగా గతంలో మహేష్, దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన మహర్షి సాంగ్స్ పై ఒకింత నెగటివిటీ రావడంతో, ఈ సారి సరిలేరు సాంగ్స్ ని దేవి ఇరగదీసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఇప్పటికే అలవైకుంఠపురములో సాంగ్స్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న థమన్ కు, త్వరలో సరిలేరు నీకెవ్వరు సాంగ్స్ తో దేవి ఏ విధంగా ఢీ కొట్టి విజయం సాధిస్తారో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: