సినీ పరిశ్రమలో వివాదాస్పద, సంచలన దర్శకుడు తన నిర్మాణంలో తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మరో సంచలనం రేపుతున్నారు.  ఇప్పటికే ఏపిలో ఎన్నికల ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’ మూవీతో రాజకీయ ప్రకంపణలు సృష్టించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపనున్నారు.  ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఏపిలో నేటి రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్టుంది.  

 

సిద్ధార్ధ తాతోలు- రామ్ గోపాల్ వ‌ర్మ క‌లిసి తెర‌కెక్కించిన కాంట్ర‌వ‌ర్షియ‌ల్ మూవీ క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు మూవీ గురించి మొదటి నుంచి కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. అప్పట్లో ట్రైలర్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 3.4 మిలియన్స్ వ్యూస్ తో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.  సినిమాకు ముందు నుంచి కాంట్రవర్సీలనే నమ్ముకున్నాడు.  నవంబ‌ర్ 29న విడుద‌ల కానున్న ఈ మూవీ నుండి మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

 

ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కి సంబంధించిన అన్ని అంశాల‌ని ఆస‌క్తిగా చూపించారు.  తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేసి ఏపి రాజకీయ నేతలందరిని మన కళ్లముందు ఉంచినట్లు కనిపిస్తుంది.  గత ఎన్నిక‌ల‌లో పోటీ చేసిన కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌పై క‌ట్ చేసిన ఈ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం పరిణామాలు ఎలా ఉన్నాయో ఈ మూవీలో చూపిస్తున్నట్టుంది.  ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్, కేఏ పాల్ లను  టార్గెట్ చేస్తూ కట్ చేసిన ఈ  ట్రైలర్ వివాదాస్పదంగా మారింది.

 

అన్ని దార్లు మూసుకుపోయినప్పుడు.. భయపెట్టాలి, హత్యలు చేయాలనే కాన్సెప్ట్ చూపించాడు. ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల‌కి సంబంధించిన అన్ని అంశాలను ఆస‌క్తిగా చూపించే ప్రయత్నం చేశారు. మరి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని సంచలనాలు..కాంట్రవర్సీలు సృష్టిందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: