అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఈ మ‌ధ్య అన్న‌పూర్ణ‌లో అంగ‌రంగ  వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అక్కినేని ఫ్యామిలికి సంబంధించిన ప్రతి ఒక్కరు హాజరయ్యారు. 2018, 2019 సంవ‌త్స‌రాల‌కు గాను శ్రీ‌దేవి, రేఖ‌ల‌కు ఏఎన్నార్ జాతీయ పుర‌స్కారాల‌ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందజేశారు.

 

అయితే ఈ కార్యక్రమంలో నాగర్జున మేనకోడలు, సుమంత్ సోదరి సుప్రియ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమెకు తోడుగా యంగ్ హీరో అడివి శేష్ కూడా కనిపించడం ప్రతీ ఒక్కర్ని షాక్ కు గురి చేస్తోంది. వీరిద్దరు కలిసి గూఢచారి సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీరి ఇద్దరి మధ్య ఏదో ఉందని రకరకల వార్తలు వస్తునే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన అడివి శేష్ సింపుల్ గా కొట్టిపారేశాడు.

 

కానీ అవే వార్తల్ని ఏఎన్నార్ అవార్డ్స్ కార్యక్రమంలో సుప్రియతో కలిసి నిజం చేయడంతో మళ్లీ కొత్త కొత్త కథనాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోబోతున్నారని.. అందుకే అడివి శేష్ నాగ్ ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఈ విషయంపై అడివి శేష్, సుప్రియ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక‌పోతే వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన గూఢ‌చారి  చిత్రంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ చాలా బావుండ‌డంతో అలాంటి వార్త‌లు వ‌స్తున్నాయా లేక వీరిద్ద‌రి మ‌ధ్య ఇంకేమైనా ఉందా అన్న‌ది తెలియాల్సి ఉంది. 

 

సుప్రియ హీరో సుమంత్‌కి తోబుట్టువు కాగా, ఇర‌వై ఏళ్ల క్రితం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. ఆ చిత్రం త‌ర్వాత సినిమాల‌కి దూరంగా ఉన్న ఆమె ప్ర‌స్తుతం త‌న మేనమామ నాగార్జునతో కలిసి అన్నపూర్ణ స్టుడియోస్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఉండిపోయింది. సుప్రియ అడ‌విశేష్ క‌న్నా ఐదేళ్లు పెద్ద‌ది కాగా, వీరి పెళ్లికి సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌లో నిజ‌మెంతో తెలియాలంటే మ‌రి వాళ్ళు స్పందించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: