టాలీవుడ్ లోకి కెరటం సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది మోడల్, నటి రకూల్ ప్రీత్ సింగ్.  ఈ మూవీ రకూల్ కి పెద్దగా పేరు తీసుకురాకపోయినా..తర్వాత సందీప్ కిషన్ తో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో అదృష్టం వరించింది.  రకూల్ అందాలకు ఫిదా అయిన టాలీవుడ్ హీరోలు ఆ అమ్మడికే ఓటేశారు.  టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన ఆ బాలీవుడ్ బ్యూటీ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.  

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ర‌శురాం తెర‌కెక్కించిన గీతగోవిందం మూవీలో ముందుగా ర‌కుల్‌ని క‌థానాయిక‌గా తీసుకోవాల‌నుకున్నార‌ట‌. ఇందు కోసం ఆమెను సంప్రదించారట..కానీ అప్పటికే బాలీవుడ్ లో దేదే ప్యార్ దే సినిమాకి డేట్స్ ఇచ్చిన కార‌ణంగా గీత గోవిందం ప్రాజెక్ట్‌ని చేయ‌లేన‌ని చెప్పింద‌ట‌.  దాంతో రకూల్ స్థానంలో రష్మిక మందన హీరోయిన్ గా ఆ ఛాన్స్ కొట్టేసింది.  టాలీవుడ్ లో ఈ మూవీ ఏ రేంజ్ హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ఏకంగా వందకోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే.

 

మూవీ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మికకు వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  ఈ విషయంపై స్పందించిన రకూల్ ప్రీత్ సింగ్  గీత‌గోవిందం వ‌దులుకున్నందుకు బాధేమి లేదు కాని చేసుంటే చాలా బాగుండేది అని చెప్ప‌కుకొచ్చింది ర‌కుల్. త‌క్కువ బ‌డ్జెట్‌తో రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా ‘గీతాగోవిందం’ ఒక అద్భుతమైన హిట్ అని చెప్పొచ్చు.  ఆ మద్య రకూల్ తాను టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించాలని తన మనసులో మాట చెప్పిన విషయం తెలిసిందే..బహుషా ఈ మూవీ ఛాన్స్ మిస్సయినందేకే ఆ విషయం ప్రస్తావించి ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: