బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్. ఆ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ స్థాయి ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిందనే చెప్పాలి. ఆ చిత్రం తర్వాత అదే స్థాయిలో చెయ్యాలని సాహో చిత్రం ప్లాన్ చేశాడు ప్రభాస్. ఆ చిత్రం బాక్సాఫీస్ ముందు కలెక్షన్లు సాధించినా ప్రభాస్ ఇమేజ్ తగ్గ స్థాయిలో ప్రేక్షకులను మాత్రం అలరించలేక పోయింది. ఇకపోతే ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓ పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతుంది.
సాహో చిత్రం చేస్తుండగానే ప్రభాస్ ఈ చిత్రానికి సైన్ చేశారు. ఈ చిత్రం ఎక్కువ శాతం ఇటలీలో షూటింగ్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మరోసారి వాయిదా పడింది దానికి కారణం ప్రభాస్. సాహో చిత్ర రిజల్ట్ చూసిన ప్రభాస్ తన అభిప్రాయాన్ని మార్చుకుని హైదరాబాద్లోనే సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు చిత్రయూనిట్. సాహో రిలీజ్ తరువాత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ రిలాక్స్ అయ్యేందుకు విదేశాలకు వెళ్లిపోయారు.
కొంత కాలం అక్కడే ఉండి వచ్చిన ప్రభాస్ ఇటీవలే ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్కు మరోసారి బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. ఈ సారి బ్రేక్ ఇవ్వడానికి కారణం కూడా ప్రభాసేనట. ఇన్నాళ్లు విదేశాల్లో ఎంజాయ్ చేసిన ప్రభాస్ కాస్త బరువు పెరగాడు. దీంతో పాత్రకు తగ్గట్టుగా తిరిగి కనిపించేందుకు ప్రభాస్ కాస్త సమయం కావాలని కోరారట. ఈ గ్యాప్లో ప్రభాస్ కాస్త గట్టిగా కసరత్తులు చేసి తన పాత్రకి తగ్గట్టు తయారవ్వాలని గ్యాప్ కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రభాస్కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఈచిత్రాన్ని యూవీ క్రియేషన్స్తో కలిసి ప్రభాస్ పెదనాన్నకృష్ణంరాజుగోపీ కృష్ణ మూవీస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ను సమంత కూడా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఏది నిజమనేది తెలియాల్సి ఉంది.