టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది మాట్లాడినా లేదా ఏ పని చేసినా అది సంచలనంగా మారుతూ ఉంటుంది. అయితే  ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారడానికి ముక్కుసూటితనమే కారణం. ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా  సక్సెస్ఫుల్  సినిమాలు అందించిన వర్మ, ఇటీవల మాత్రం ఆ స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నారు. ఇక గత కొద్దికాలంగా పలు వివాదాస్పద అంశాలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ వాటిపై సినిమాలు తీస్తున్న వర్మ, ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే పేరుతో మరొక వివాదాస్పద సినిమాకు శ్రీకారం చుట్టారు. 

 

వాస్తవానికి గత ఏడాది తాను తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని అప్పటి టీడీపీ ప్రభుత్వం రిలీజ్ కానీయకుండా అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఆగ్రహించిన వర్మ, అప్పటినుండి టీడీపీ పై అలానే చంద్రబాబుపై  తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసిపి గెలవడం, అలానే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగిన తర్వాత, వర్మ తన తాజా సినిమా కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనౌన్స్ చేసి పెద్ద సంచలనానికే తెర లేపారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు ట్రైలర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకోవడంతో పాటు సినిమా పై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు పెంచింది. ఇక ఈ ట్రైలర్ లో చంద్రబాబు, లోకేష్, జగన్, పవన్ లపై వర్మ వేసిన సెటైర్లకు కొందరు సుముఖత వ్యక్తం చేస్తే, 

 

మరికొందరు మాత్రం ఆయనపై సోషల్ మీడియా మాధ్యమాల్లో విరుచుకుపడుతూ కామెంట్స్ చేసారు. ఇకపోతే నేడు ఆ సినిమా రెండవ ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ, ఆ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్, కేఏ పాల్, చంద్రబాబు, లోకేష్ లతో పాటు ఏపీ సీఎం జగన్ ని కూడా టార్గెట్ చేసాడు. ఇక ట్రైలర్ చివరిలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా అంటూ జగన్ పాత్రధారి రాజీనామా లెటర్ చేతిలో పట్టుకుని పలికిన డైలాగ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా ఈ ట్రైలర్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: