సోషల్ మీడియాలో ఒక పెద్ద సెన్సేషనల్ ఎవరంటే అది కేవలం శ్రీరెడ్డి మాత్రమే. ఆమె ఏ పోస్ట్ పెట్టినా అది ఒక పెద్ద సంచలనం అవడం సహజం. ఎవర్ని ఎక్కడ నుంచి ఎప్పుడు టార్గెట్ చేస్తుందో ఆమెకే తెలియదు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఈమె పవన్ కల్యాణ్ గురించి ఒక దారుణమైన పోస్ట్ పెట్టి పవన్ కళ్యాణ్ అభిమానుల మనో భావాలను దెబ్బతీస్తుంది. 

 

మొన్న ఈ మధ్య కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ పై చేసిన కామెంట్స్ తమిళ సినీ అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. వాళ్లు ఆమెను తమిళనాడు లో అడుగుపెడితే చంపేస్తాం అంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికతో భయపడిపోయిన శ్రీ రెడ్డి.. వెంటనే చెన్నైలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ పోస్టులు ఆ కామెంట్స్ చేసింది తాను కాదంటూ.. వేరే ఎవరో కావాలనే పని కట్టుకొని పోస్ట్లు పెడుతున్నారంటూ చెప్పుకొచ్చింది.

 

మళ్లీ తాజాగా తన అకౌంట్ లో ఒక పవన్ కల్యాణ్ మార్నింగ్ ఫోటో పెట్టి నాకు ఎవరో సెండ్ చేశారు.. పాపం రా అంటూ ఫేసుబుక్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో శ్రీ రెడ్డి కాళ్ళకింద పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అది చూసి పక్కనే పవన్ భార్య ఆశ్చర్యపోతున్నట్టు ఫోటో ఉంది. శ్రీమంతుడు సినిమాలోని మామిడితోట సీన్‌లో వచ్చే దానికి ఇది స్పూఫ్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 

ఈ ఫోటో చూసి పవన్ కల్యాణ్ అభిమానులు కామెంట్ సెక్షన్లో శ్రీ రెడ్డిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇలాంటి పోస్టుల వలన ఏమి ఉపయోగం అంటూ కొంతమంది తిడుతుంటే... నిన్ను మోసం చేసింది చిన్నవాళ్ళు కదా! మరి ఇలాంటి పెద్ద స్టార్స్ మీద ఎందుకు కామెంట్ చేస్తున్నావ్ అంటూ నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. ఏదేమైనా శ్రీరెడ్డికి ఏదో ఒక పోస్టు పొట్టి తిట్లు తింటూ కాలయాపన చేయడం బాగా అలవాటైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: